Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏం చేసేదీ నా తల్లిదండ్రుల మాట కాదనలేకపోయా, ఐతే చచ్చిపోదాం రమ్మంటూ...

Webdunia
బుధవారం, 17 మార్చి 2021 (13:37 IST)
నిజామాబాద్ జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ప్రియురాలు ప్రాణాలు కోల్పోగా, ప్రియుడు ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్నాడు.
 
వివరాల్లోకి వెళితే... సిరికొండ మండలం పందిమడుగు గ్రామానికి చెందిన వందన అనే యువతి చింతల్ తండాకు చెందిన సుభాష్‌తో ప్రేమలో పడింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఐతే సుభాష్ తల్లిదండ్రులు వేరే అమ్మాయితో వివాహం నిశ్చయించారు. పెద్దల మాట కాదనలేక ఆమెను పెళ్లాడాడు. పెళ్లయి 2 నెలలయింది. ప్రేమికురాలు బుధవారం ఉదయం సుభాష్ కి ఫోన్ చేసి పిలిచింది.
 
ఇద్దరూ శివారులో వున్న పొలంలోకి వెళ్లారు. అక్కడికెళ్లాక... తనను కాదని వేరే యువతిని ఎలా పెళ్లాడావంటూ ఆమె నిలదీసింది. ఈక్రమంలో ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకుని చనిపోదామని నిర్ణయించుకుని పురుగులు మందు తాగారు. పొలంలో నురగలు కక్కుతు వున్న జంటను చూసి స్థానికులు ఫిర్యాదు చేయడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. 
 
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వందన చనిపోయింది. సుభాష్ కూడా ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా ఐటమ్ సాంగ్ కంటే నాదే బెటర్.. ఊర్వశీ రౌతులా.. ఆపై పోస్ట్ తొలగింపు

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments