Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు ప్ర‌మాదంలో యువ‌తి మృతి: పార్టీలో ఎంజాయ్.. వేగంగా కారు నడపటంతో?

Webdunia
సోమవారం, 2 ఆగస్టు 2021 (18:38 IST)
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ చదువుతున్న యువతి దుర్మరణం పాలైంది. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కారు నడుపుతున్న వ్యక్తి మద్యం సేవించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇంకా అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అంటున్నారు. 
 
వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్‌కు చెందిన ఆశ్రిత అనే అమ్మాయి కెనడాలో బీటెక్ చదువుతోంది. ఇటీవలే నగరానికి వచ్చిన ఆమె ఆదివారం ఫ్రెండ్ షిప్‌డే కావడంతో తన స్నేహితులైన అభిషేక్, సత్య ప్రకాష్, తరుణిలతో కలిసి వేడుకల్లో పాల్గొంది. వీరంతా అర్ధరాత్రి వరకు పార్టీలో ఎంజాయ్ చేశారు. ఈ బ్యాచ్‌లోని ముగ్గురు అబ్బాయిలు మద్యం సేవించారు. ఇంటి కెళ్లే క్రమంలో అభిషేక్ డ్రైవింగ్ చేస్తున్నాడు. మద్యం మత్తు పైగా అతివేగంతో కారు నడపడం వల్ల గచ్చిబౌలి బ్రిడ్జి వద్దకు రాగానే కారు అదుపు తప్పి మూడు పల్టీలు కొట్టి పక్కనే ఉన్న గోడను ఢీకొట్టింది.
 
ఆ ప్రమాదంలో ఆశ్రిత అక్కడికక్కడే మృతి చెందగా.. మిగిలిన ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆశ్రిత మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కి తరలించారు. ఈ ఘటనతో ఆశ్రిత కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments