Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండేళ్లపాటు రేప్ చేశాడు... ఇప్పుడు ఫ్రెండ్స్​తో కలిసి వీడియోలు..

Webdunia
మంగళవారం, 27 అక్టోబరు 2020 (18:37 IST)
వరుసకు చెల్లి అయ్యే బాలికపై కన్నేశాడు. స్నానం చేస్తుండగా ఫొటోలు తీసి బెదిరించాడు.. ఏకంగా రెండేళ్లపాటు రేప్ చేశాడు. ఇప్పుడు ఫ్రెండ్స్​తో కలిసి అఘాయిత్యం చేశాడు.

అందరూ వీడియోలు తీసుకుని వాట్సాప్, ఫేస్​బుక్​లో పోస్టు చేశారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో జరిగిందీ పైశాచిక ఘటన. ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను మెట్ పల్లి డీఎస్పీ గౌస్ బాబా తెలిపారు.
 
వీడియోలు తీసి.. షేర్ చేసి..
మెట్​పల్లికి చెందిన ఓ బాలిక (14) ఇంటిపక్కనే వరుసకు అన్న అయ్యే రాజేశ్ ఉంటున్నాడు. రెండేళ్ల కిందట బాలిక స్నానం చేస్తుండగా ఫొటోలు తీశాడు. ఆ ఫొటోలను బాలికకు చూపించి బ్లాక్ మెయిల్ చేశాడు. తాను చెప్పిన దానికి ఒప్పుకోక పోతే ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు.

అమ్మాయిని లొంగదీసుకుని రెండేండ్లలో పలుసార్లు అత్యాచారం చేశాడు. 20 రోజుల కిందట బాధితురాలికి ఫోన్ చేసి ఓ స్కూల్ వెనకాల ఉన్న గోడ వద్దకు రావాలని చెప్పాడు. బాలిక అక్కడికి వెళ్లగానే రాజేశ్ ఆమెను మరోసారి రేప్ చేశాడు. దీన్ని అతని స్నేహితులు వీడియో తీశారు.

తర్వాత దారంగుల సాయిలు, మొగిలిపాక అనిల్ కుమార్, కుంచెపు శివ, కుంచెపు వెంకటేశ్ రేప్ చేశారు. వీరందరూ అత్యాచారం చేసేటప్పుడు ఒక్కొక్కరు వీడియోలు తీసి వాట్సాప్, ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. వీడియోలు సోషల్ మీడియాలో పెట్టడంతో విషయం బయటికి వచ్చింది.

బాధితురాలి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు ఐదుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి ఐదు సెల్ ఫోన్లు, రెండు బైకులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలిస్తామని డీఎస్పీ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments