Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాసలో ఉన్నవారంతా తాలిబన్ తీవ్రవాదులే : వైఎస్ షర్మిల

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2022 (14:30 IST)
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో ఉన్నవారంతా తాలిబన్ తీవ్రవాదులతో సమానమని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల ఆరోపించారు. తాను చేపట్టిన పాదయాత్రను అడ్డుకునేందుకే తనపై దాడి చేశారని ఆమె ఆరోపించారు. 
 
గురువారం రాజ్‌భవన్‌‍లో గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్‌తో ఆమె సమావేమయ్యారు. గవర్నర్‌తో భేటీ తర్వాత ఆమె మాట్లాడుతూ, తెలంగాణాలో తన పాదయాత్రను తెరాస, రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తుందని ఆరోపించారు. ఈ క్రమంలోనే నర్సంపేటలో తన వాహనంపై దాడి చేసి, తన వాహనాన్ని ధ్వంసం చేశారని ఆరోపించారు. 
 
ఆ ధ్వంసం చేసిన వాహనంతోనే ప్రగతి భవన్‌లో వెళుతుండగా పోలీసులు తనను అరెస్టు చేశారని ఆమె చెప్పారు. గవర్నర్‌తో భేటీ సందర్భంగా అన్ని విషయాలు చెప్పినట్టు షర్మిల తెలిపారు. అదేసమయంలో ఆమె సీఎం కేసీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. సీఎం కేసీఆర్ తెలంగాణాను మరో ఆప్ఘనిస్తాన్‌గా మార్చివేస్తున్నారంటూ ఆరోపించారు. తాలిబన్ల మాదిరిగా పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. తెరాస పార్టీలో ఉన్న వాళ్ళంతా తాలిబన్లతో సమానమని ఆమె మండిపడ్డారు. 
 
కేవలం ట్రాఫిక్ జామ్ అయిన కేసులో తనను పోలీసులు అరెస్టు చేశారని, ఒక మహిళ అని కూడా చూడకుండా తాను కూర్చున్న కారును టోయింగ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గంటల తరబడి తనను పోలీస్ స్టేషన్‌లో విచారించడంతో పాటు తన వెంట వచ్చిన కార్యకర్తలను పోలీసులు తీవ్రంగా కొట్టారని ఆమె ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నటులు అమ్ముడుపోయారు - ప్రకాష్ రాజ్ కామెంట్స్

మండాడి నుండి సూరి, సుహాస్ ఫస్ట్ లుక్ విడుదల

రిహాబిలిటేషన్ సెంటర్‌ కు వెళ్ళిన అల్లు అరవింద్, బన్నీ వాసు

Mrunal Thakur And Sumanth: మృణాల్ ఠాకూర్ ప్రేమలో పడిన సుమంత్..? త్వరలోనే పెళ్లి..?

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments