Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాహో హీరోయిన్ అనుష్కే నట..రమేష్ బాలా ట్వీట్ నిజమే చెబుతోందా?

ఒక దేవసేన, ఒక అమరేంద్ర బాహుబలి.. ఈ జంట ఇప్పుడు భారతదేశంలో అత్యంత విజయవంతమైన జంట. ఒక జీవితకాలానికి సరిపడ చిరకీర్తిని ఈ రెండు పాత్రలూ ఆర్జించుకున్నాయి. ఇప్పటికీ బాహుబలి హ్యాంగోవర్ నుంచి బయటపడని ఈ జంట మళ

Webdunia
గురువారం, 6 జులై 2017 (06:05 IST)
ఒక దేవసేన, ఒక అమరేంద్ర బాహుబలి.. ఈ జంట ఇప్పుడు భారతదేశంలో అత్యంత విజయవంతమైన జంట. ఒక జీవితకాలానికి సరిపడ చిరకీర్తిని ఈ రెండు పాత్రలూ ఆర్జించుకున్నాయి. ఇప్పటికీ బాహుబలి హ్యాంగోవర్ నుంచి బయటపడని ఈ జంట మళ్లీ మరో సినిమాలో జత కట్టడానికి సిద్ధమైపోయారని వార్తలు. తమిళ చిత్ర విశ్లేషకుడైన రమేష్ బాలా ట్వీట్ సాక్షిగా వీరిరువురు సాహోలో జంటగా నటిస్తున్నారని తెలుస్తోంది.
 
ప్రభాస్-అనుష్క జంట తెలుగు వెండితెర మీద ఎవర్‌గ్రీన్ జంటగా పేరు తెచ్చుకుంది. బాహుబలితో భారీ విజయాలను అందుకున్న ఈ జంట తాజాగా మరో సినిమాలో అలరించబోతోంది. యువ దర్శకుడు సుజీత్ డైరెక్షన్‌లో ప్రభాస్ సాహో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. టీజర్‌తోనే అంచనాలు పెంచేసిన ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు.
 
దీపికా పదుకునే, కత్రినా కైఫ్, అనుష్క.. ఇలా పలువురి పేర్లు వినిపించినా చిత్ర యూనిట్ అయితే ఇప్పటి వరకు ఎవరినీ నిర్ధారించలేదు. తాజాగా తమిళ సినీ విశ్లేషకుడైన రమేష్ బాలా సాహో చిత్రంలో హీరోయిన్‌గా అనుష్కను తీసుకున్నట్లు ట్వీట్ చేశారు. కాగా, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో  సాహో తెరకెక్కుతోంది. అయితే ఈ విషయంపై మూవీ టీం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదంపై ఉక్కుపాదం: శ్రీనగర్ లో రక్షణమంత్రి రాజ్‌నాథ్

Donald Trump: భారతదేశంపై ట్రంప్ అక్కసు, యాపిల్ ప్లాంట్ ఆపేయమంటూ ఒత్తిడి

Lorry: లారీ వెనక్కి వచ్చింది.. లేడీ బైకరుకు ఏమైందంటే? (video)

UP: డబుల్ డెక్కర్‌ బస్సులో అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments