Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛార్మీపై చేయి వేసిన కానిస్టేబుల్ శ్రీనివాస్.. అసహనంతో సిట్ అధికారులతో ఫిర్యాదు

కారు దిగి సిట్ కార్యాలయంలోకి ప్రవేశిస్తున్నప్పుడు ఓ కానిస్టేబుల్ తనపై చేయి వేశాడని సిట్ అధికారులతో ఆమె ఫిర్యాదు చేసింది. డ్రగ్స్ కేసులో ఛార్మి బుధవారం విచారణకు హాజరైంది. ఆమె సిట్ కార్యాలయానికి వచ్చినప

Webdunia
బుధవారం, 26 జులై 2017 (14:07 IST)
కారు దిగి సిట్ కార్యాలయంలోకి ప్రవేశిస్తున్నప్పుడు ఓ కానిస్టేబుల్ తనపై చేయి వేశాడని సిట్ అధికారులతో ఆమె ఫిర్యాదు చేసింది. డ్రగ్స్ కేసులో ఛార్మి బుధవారం విచారణకు హాజరైంది. ఆమె సిట్ కార్యాలయానికి వచ్చినప్పుడు పోలీసుల్ చేసిన హైడ్రామాపై సిట్ అధికారులకు ఛార్మీ ఫిర్యాదు చేసింది.
 
చార్మీ కారు దిగి కార్యాలయం లోపలికి వచ్చే సమయంలో అక్కడున్న పోలీసులు సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. అక్కడ మహిళా పోలీసులు ఉన్నప్పటికీ శ్రీనివాస్ అనే కానిస్టేబుల్ చార్మిపై చేయి వేశాడు. దీనిపై అప్పుడే చార్మి కాస్త అసహనం వ్యక్తం చేసింది. 
 
అనంతరం ఐదో అంతస్తులోకి వెళ్లి విచారణకు హాజరైన చార్మి తొలుత ఈ విషయాన్నే ప్రస్తావించినట్లు సమాచారం. శ్రీనివాస్ అనే కానిస్టేబుల్ తనపై చేయివేశాడని అతనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపడతామని సిట్ అధికారులు చార్మికి హామీ ఇచ్చినట్లు సమాచారం.
 
మరోవైపు డ్రగ్స్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఛార్మీని సిట్ అధికారులు విచారిస్తున్నారు. చార్మి, కెల్విన్‌ మధ్య వెయ్యికి పైగా వాట్సప్‌ కన్వర్జేషన్స్‌ జరిగినట్లు సమాచారం. కెల్విన్‌ ఫోన్‌లో చార్మి దాదా పేరుతో ఫోన్‌ నెంబర్‌ ఉన్నట్లు తెలిసింది.

జ్యోతిలక్ష్మి సినిమా ఫంక్షన్‌లో కెల్విన్‌తో కలిసి చార్మి ఫొటోలు దిగినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అసిస్టెంట్ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్ అనిత, జయలక్ష్మి, రేణుక, శ్రీలత ఛార్మిని ఇంటరాగేట్ చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం ఐదు గంటల వరకు సిట్ అధికారులు ఛార్మీని విచారించనున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad Woman Doctor: రూ.5 లక్షల విలువైన కొకైన్ కోసం ఆర్డర్ చేసిన వైద్యురాలు

Vidadala Rajini: విడదల రజినికి మరో ఎదురుదెబ్బ- అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ (video)

My Sindoor to Border: పెళ్లైన మూడు రోజులే. నా సింధూరాన్ని సరిహద్దులకు పంపుతున్నా..

Asaduddin Owaisi: పాకిస్తాన్ మజాక్ చేస్తుంది.. భారత్ కోసం ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధం.. ఓవైసీ (video)

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments