Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ కొత్త సినిమా పేరు చూసి హడలిపోతున్న యువహీరోలు.. ఎందుకు?

జూనియర్ ఎన్‌టిఆర్. ప్రతి సినిమాలోను కొత్త గెటప్‌లో కనిపిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకుంటున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలన్నీ భారీ కలెక్షన్ల దిశగా దూసుకెళుతుంటే కొంతమంది యువ హీరోలకు అది ఏమాత్రం మింగుడు పడటం లేదు. జూనియర్ బాగా రాటు తేలిపోతున్న

Webdunia
మంగళవారం, 7 నవంబరు 2017 (18:48 IST)
జూనియర్ ఎన్‌టిఆర్. ప్రతి సినిమాలోను కొత్త గెటప్‌లో కనిపిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకుంటున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలన్నీ భారీ కలెక్షన్ల దిశగా దూసుకెళుతుంటే కొంతమంది యువ హీరోలకు అది ఏమాత్రం మింగుడు పడటం లేదు. జూనియర్ బాగా రాటు తేలిపోతున్నాడే.. ఆయనకు ఇక తిరుగులేదా.. డైనమిక్ దర్శకులతో మంచి పేరు సంపాదించేస్తున్నాడే.. ఇది యువ హీరోల మధ్య జరుగుతున్న చర్చ. 
 
జై లవకుశ సినిమాలో మూడు పాత్రలను పోషించి మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నారు జూనియర్ ఎన్‌టిఆర్. ఆ ఒక్క సినిమానే కాదు. అంతకుముందు నటించిన అన్ని సినిమాల్లోను జూనియర్‌ది అందివేసిన చేయి. అయితే ఇప్పుడంతా జూనియర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌లు తీయనున్న సినిమాపైనే తెలుగు సినీపరిశ్రమలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. హారిక హాసిని ప్రొడక్షన్ బ్యానర్ పైన త్రివిక్రమ్ జూనియర్ ఎన్‌టిఆర్‌తో కలిసి ఒక సినిమాను చేయనున్నారు. ఆ సినిమాపై యంగ్ టైగర్ అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు.
 
పవన్ కళ్యాణ్‌కు మంచి హిట్లు ఇచ్చిన త్రివిక్రమ్ మొదటిసారి జూనియర్‌తో సినిమా చేయడం ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. మొదటగా వీరి సినిమాకు సోల్జర్, రాముడు-భీముడు అనే టైటిళ్లను అనుకున్నారట. ఈ పేరుతో భారీగానే ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. కానీ ఆ తరువాత సినిమా నిర్మిస్తున్న సంస్థ మాత్రం ఆన్ సైలెంట్ మోడ్.. అనే పేరుతో సినిమాను రిజిస్ట్రేషన్ చేయించుకుంది. ఇలాంటి పేరుతో ఎప్పుడూ సినిమాలు రాలేదు. అందులోను నిశ్శబ్దంగా ఉండటమనేది టైటిల్. దీనిపైనే భారీ అంచనాలు ఉండగా యువ హీరోలు మాత్రం వీటిని తలుచుకుని తెగ బాధపడిపోతున్నారట. 2018 దసరా కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశం దాడులతో పాకిస్తాన్ కకావికలం: బంకర్‌లో దాక్కున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి

INS Vikrant గర్జన: పాకిస్తాన్ లోని కరాచీ పోర్టు నేలమట్టం (video)

జమ్మూపై పాకిస్తాన్ క్షిపణి, డ్రోన్ దాడులు: పాక్ 2 JF17 ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత సైన్యం

Anantapur MP: అనంతపురం ఎంపీ సోదరి హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి

Telangana: ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తున్నాం.. భట్టి విక్రమార్క

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments