Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏయ్ కమ్మీ.. నోరు జాగ్రత్త. మండిపడ్డ పవర్ స్టార్. బిత్తరపోయిన యూనిట్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వేదిక మీదే శివాలెత్తిపోతే చూడలేం. శత్రువు ఎదురుగా ఉన్నట్లు ఊహించుకుని అయ్ అయ్ ఆయ్ అంటూ పవన్ రంకె వేశాడంటే గుండె అదరాల్సిందే. తానెందుకు ఎలా ఎగురుతున్నాడు. అలా ఎందుకు మండిపడుతున్నాడు అనేది ఎవరికీ అర్థంకాకపోవచ్చనేది మరో విషయం.

Webdunia
సోమవారం, 10 జులై 2017 (07:51 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వేదిక మీదే శివాలెత్తిపోతే చూడలేం. శత్రువు ఎదురుగా ఉన్నట్లు ఊహించుకుని అయ్ అయ్ ఆయ్ అంటూ పవన్ రంకె  వేశాడంటే గుండె అదరాల్సిందే. తానెందుకు ఎలా ఎగురుతున్నాడు. అలా ఎందుకు మండిపడుతున్నాడు అనేది ఎవరికీ అర్థంకాకపోవచ్చనేది మరో విషయం. కానీ షూటింగులో ఉండగా పవన్ బారిన పడితే వాళ్లు కోలుకోవడం కష్టమేనని చాలా సందర్బాలల్లో రుజువైంది. పవన్‌ వద్ద ఉన్నప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోకుంటే చాలా ప్రమాదం అని తెలియని ఒక కమిడియన్ ఇటీవలే తనతో పెట్టుకుని జన్మకు సరిపడే అనుభవం సంపాదించుకున్నాడని వార్తలు. 
 
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కి కోపమొస్తే ఎలా వుంటుందో చాలామందికి తెలుసు. ఈసారి పవన్ చేతిలో ఆగ్రహానికి గురైంది ఓ కమెడియన్ అని తెలుస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజుల నుంచే హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ షూటింగ్ జరుగుతున్న సెట్స్‌లోనే ఓ కమెడియన్ పవన్ కల్యాణ్ వద్ద జనసేన పార్టీ ప్రస్తావన తీసుకొచ్చారట. సినిమా షూటింగ్ జరుగుతున్న చోట జనసేన పార్టీ ప్రస్తావన తీసుకొచ్చిన కమెడియన్‌పై పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్టు సమాచారం.  నీ హద్దుల్లో నువ్వు వుంటే చాలా మంచిది అని పవన్ అతడిని కాస్త గట్టిగానే మందలించారట.
 
ఫిలింనగర్ టాక్ ప్రకారం పవన్ ఆగ్రహానికి గురైన కమెడియన్ పేరు ఏంటనేది బహిర్గతం కావడం లేదు కానీ అతడు నతిన్-త్రివిక్రమ్‌ల 'అ.. ఆ' సినిమాలోనూ నటించాడని మాత్రం తెలుస్తోంది
పవన్ కల్యాణ్ సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్, అను ఎమాన్యుయెల్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. జులై 19న పవన్-త్రివిక్రమ్ మూవీ యూనిట్ యూరప్ ప్రయాణమవుతోంది. 20 రోజులపాటు జరగనున్న ఈ షెడ్యూల్‌లో రెండు పాటలు చిత్రీకరించనున్నారు.
 
పవన్ బారిన పడి నలిగిపోయిన ఆ కమెడియన్ ఎవరంటారా.. అ ఆ సినిమాను తల్చుకోండి మరి..
అన్నీ చూడండి

తాజా వార్తలు

Balochistan: బలూచిస్తాన్‌లో 14మంది పాకిస్థాన్ సైనికులు మృతి.. బాధ్యత వహించిన బీఎల్ఏ (video)

Malala Yousafzai: భారతదేశం-పాకిస్తాన్ దేశాలు సంయమనం పాటించాలి.. మలాలా యూసఫ్ జాయ్

Operation Sindoor impact: పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంటుంది.. ఈ యుద్ధాన్ని చివరి వరకు తీసుకెళ్తాం

Rahul Gandhi: రాహుల్ గాంధీ పార్లమెంటరీ సభ్యత్వం సవాలు- పిటిషన్ కొట్టివేత

India: 25 వైమానిక మార్గాలను నిరవధికంగా మూసివేసిన భారత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments