Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏంటి మెహ్రీన్...? అదేదో ఇచ్చేయరాదూ... ఎవరు? ఏంటది?

Webdunia
శనివారం, 15 డిశెంబరు 2018 (18:34 IST)
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే మంచి ఊపు మీదున్న నటి మెహ్రీన్ ఈమధ్య ఇండస్ట్రీలో వార్తల్లో నిలుస్తోంది. ఈమె పులి వాసు దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తోంది. ఐతే ఉన్నట్లుండి నిర్మాతకు షాకిచ్చిందట. హీరోను మార్చేసి మీ ఇష్టం వచ్చినట్లు చేస్తే నటించడానికి నేను తేరగా వున్నానా అంటూ మండిపడుతోందట. అసలు విషయం ఏంటయా అంటే.. మెగాస్టార్ చిరు చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా ఇటీవలే ఓ సినిమా స్టార్ట్ అయింది కదా. ఈ చిత్రాన్ని తొలుత సుధీర్ బాబు హీరోగా ప్రియా వారియర్ హీరోయిన్‌గా చేయాలని అనుకున్నారట.
 
ఏమైందో తెలియదు కానీ... ప్రియా వారియర్ ఈ చిత్రాన్ని తను చేయడం లేదని అడ్డం తిరిగిందట. దానితో ఆ పాత్రలో మెహరీన్‌ను తీసుకున్నారట. ఇందుకు గాను ఆమెకు 30 లక్షల పారితోషికం ఇస్తామని ఒప్పందం కూడా కుదుర్చుకున్నారట. అడ్వాన్సుగా రూ. 10 లక్షలు ఇచ్చారట. ఐతే ఎందుకో తెలియదు కానీ సుధీర్ బాబు కూడా తను ఈ చిత్రంలో హీరోగా చేయనని హ్యాండిచ్చాడట. దానితో మెగాస్టార్ అల్లుడు కల్యాణ్ దేవ్‌ను సంప్రదించి ఆయన్ని ఓకే చేశారట. 
 
ఈ విషయం తెలిసిన మెహ్రీన్... మీ ఇష్టం వచ్చినట్లు హీరోను మార్చేసి నటించమంటే నటించడానికి నేనేమి తేరగా లేనంటూ మండిపడుతోందట. ముందుగా చెప్పినట్లు కాకుండా ఇలా మార్పులు చేసినందుకు తను నటించననీ, అలాగే తనకు ఇచ్చిన అడ్వాన్సు కూడా తిరిగి ఇవ్వనని అంటున్నట్లు టాలీవుడ్ సినీ జనం చెప్పుకుంటున్నారు. 
 
ఐతే నిర్మాత మాత్రం... మెహ్రీన్ నటించి తీరాల్సిందేనంటూ పట్టుబడుతున్నాడట. దీనికి మెహ్రీన్ ససేమిరా అనడంతో తన అడ్వాన్సు ఇప్పించాలని నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశాడట సదరు నిర్మాత. మరోవైపు మెహ్రీన్ కు మద్దతుగా కొందరు హీరోలు, మేనేజర్ తప్ప ఎవ్వరూ లేరట. దీనితో కొందరు పేరుమోసిన నిర్మాతలు... ఎందుకు మెహ్రీన్... ఆ అడ్వాన్స్ ఏదో తిరిగి ఇచ్చేయరాదూ అని సలహాలు ఇస్తున్నారట. అలా ఇచ్చేయమనేవారు ఆమెకేమైనా ఆఫర్లు ఇస్తే బాగుంటుందిగా అని ఆమెకు మద్దతుగా వుండేవారు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pahalgam Terrorist Attack, తెలంగాణ వాసి మనీష్ రంజన్ మృతి

Pahalgam terror attack ఫిబ్రవరిలో కాన్పూర్ వ్యాపారవేత్త పెళ్లి: కాశ్మీర్‌ పహల్గామ్‌ ఉగ్రవాద దాడిలో మృతి

Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్‌కు గట్టి షాక్- వైకాపా నుంచి సస్పెండ్

IMD: ఏప్రిల్ 26 వరకు హీట్ వేవ్ అలర్ట్ జారీ- 44 డిగ్రీల కంటే పెరిగే ఉష్ణోగ్రతలు

Pahalgam terror attack LIVE: 28మంది మృతి.. మృతుల్లో విదేశీయులు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments