Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెటిఆర్‌ను కలిసిన రకుల్‌ప్రీత్ సింగ్.. ఎందుకు..?

Webdunia
శనివారం, 2 మార్చి 2019 (21:08 IST)
హీరోయిన్లను హీరోలు కలవడం మామూలే. వారి మధ్య గాసిప్స్ చోటుచేసుకోవడం షరా మామూలే. అయితే రాజకీయ నాయకుడిని టాప్ హీరోయిన్ కలిస్తే ఏదో జరుగుతుందని అనుకోవాలి. ఆ హీరోయిన్ రాజకీయాల్లోకి వెళ్ళడమో లేకుంటే వేరే ఇతరత్రా పనులు ఏమైనా ఉన్నాయో అన్న కోణంలో చూడాల్సి ఉంటుంది.
 
అలాంటి పరిస్థితే తెలంగాణా మంత్రి కెటిఆర్.. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మధ్య ఏర్పడింది. రెండురోజుల క్రితం హైదరాబాద్ లోని ఒక ప్రముఖమైన హోటల్లో వీరిద్దరు రహస్యంగా కలిశారట. ఈ రహస్య కలయికకు అసలు కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే. ఇప్పటికే ఎన్నో ప్రభుత్వ కార్యక్రమాలతో తెలంగాణా ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ప్రభుత్వ పథకాలు మరింతగా ప్రజలకు తెలియాలంటే ఖచ్చితంగా ప్రచారకర్త అవసరం. అది కూడా అందమైన హీరోయిన్ అయితే బాగుంటుందన్నది ముఖ్యమంత్రి కెసిఆర్ ఉద్దేశమట.
 
అందుకే కెటిఆర్‌కు ఆ బాధ్యతలను కెసిఆర్ అప్పగించారట. దీంతో కెటిఆర్ హీరోయిన్ల కోసం వెతుకుతున్న నేపథ్యంలో విషయం తెలుసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఆ అవకాశం కోసం కెటిఆర్‌ను కలవడానికి సిద్ధమైందట. ఆ క్రమంలో ఆమె కేటీఆర్‌ను కలిసి బ్రాండ్ అంబాసిడర్‌గా తను వ్యవహరిస్తానని చెప్పిందని, ఈ మేరకు ఆయనతో 10 నిమిషాలు మాత్రమే చర్చించుకున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments