Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ తెరపై కనిపించనున్న ''రారండోయ్ వేడుక చూద్దాం'' జోడీ

''రారండోయ్ వేడుక చూద్దాం'' సినిమాలో చైతూకు జోడీగా నటించిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మళ్లీ నాగచైతన్యతో రొమాన్స్ చేసే అవకాశాన్ని కైవసం చేసుకుంది. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకున్న ఈ జ

Webdunia
గురువారం, 22 ఫిబ్రవరి 2018 (11:18 IST)
''రారండోయ్ వేడుక చూద్దాం'' సినిమాలో చైతూకు జోడీగా నటించిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మళ్లీ నాగచైతన్యతో రొమాన్స్ చేసే అవకాశాన్ని కైవసం చేసుకుంది. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకున్న ఈ జంట.. మళ్లీ వెండితెరపై కనిపించనుంది. 
 
గతంలో కృష్ణవంశీ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన సౌజన్య చైతూ-రకుల్‌కి ఓ కథ వినిపించిందని.. ఆ కథ కొత్తగా వుండటంతో ఇద్దరూ ఆ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చేతిలో వున్న సినిమాలు పూర్తి చేసుకుని ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొనేందుకు ఈ జంట సిద్ధమవుతున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల టాక్. 
 
మే లేదా జూన్ నెలల్లో ఈ సినిమా సెట్స్‌పైకి రానుంది. ఈ సినిమాతో పాటు మరో రెండు-మూడు తమిళ సినిమాలు రకుల్ చేతిలో వున్నాయి. ఇక నాగచైతన్య ఎస్. రాధాకృష్ణ దర్శకత్వంలో ''శైలజా రెడ్డి అల్లుడు'' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యను చంపి ఇంట్లో పాతిపెట్టిన భర్త.. తర్వాత భయంతో ఆత్మహత్య!!

ఆత్మాహుతికి నాకొక బాంబు ఇవ్వండి.. పాకిస్థాన్ వెళతా : కర్నాటక మంత్రి (Video)

భారతీయ వంట మనిషిని ఉరితీసిన కువైట్!!

వధువే అసలైన కానుక... రూ.లక్షల కట్నాన్ని సున్నితంగా తిరస్కరించిన వరుడు!!

బాబ్బాబు.. మీకు దణ్ణం పెడతాం.. భారత్ దాడి నుంచి రక్షించండి.. గల్ఫ్ దేశాలకు పాక్ వినతి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments