Webdunia - Bharat's app for daily news and videos

Install App

నానిని బండ బూతులు తిట్టిన సాయి పల్లవి... ఎందుకు?

ఫిదా తరువాత సాయిపల్లవి ఒక రేంజ్‌కు పెరిగిపోయింది. కానీ కొత్తకొత్త సినిమాలకు కమిటయ్యే విషయంలో మాత్రం ఇప్పటికీ సాయిపల్లవి జాగ్రత్తగానే వ్యవహరిస్తోంది. రెమ్యునరేషన్ కంటే కథలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. నిర్మాత దిల్ రాజు సినిమాల్లో నటిస్తే ఆ సినిమా భార

Webdunia
శనివారం, 23 సెప్టెంబరు 2017 (19:26 IST)
ఫిదా తరువాత సాయిపల్లవి ఒక రేంజ్‌కు పెరిగిపోయింది. కానీ కొత్తకొత్త సినిమాలకు కమిటయ్యే విషయంలో మాత్రం ఇప్పటికీ సాయిపల్లవి జాగ్రత్తగానే వ్యవహరిస్తోంది. రెమ్యునరేషన్ కంటే కథలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. నిర్మాత దిల్ రాజు సినిమాల్లో నటిస్తే ఆ సినిమా భారీ విజయం సాధిస్తుందన్న నమ్మకం సాయి పల్లవిలో చాలా ఎక్కువగా ఉంది. మొదటి సినిమా ఫిదాతో తానేంటో నిరూపించుకుంది సాయి పల్లవి. మొదటి సినిమాతో మంచి సక్సెస్ ఇచ్చిన దిల్ రాజు అడగగానే ఎంసిఎ సినిమాలో నటించేందుకు ఒప్పుకుంది సాయి పల్లవి.
 
ఈ సినిమాలో హీరో నాని. ఇప్పటికే 70 శాతం సినిమా పనులు కూడా పూర్తయ్యాయి. అయితే కొన్ని రోజుల ముందు షూటింగ్ జరుగుతున్న సమయంలో నాని, సాయి పల్లవిల మధ్య చిన్న తగాదా వచ్చిందట. డైలాగ్‌ల విషయంలో నాని అలా చెప్పొద్దు.. ఇలా చెప్పు అని సాయి పల్లవికి చెప్పడంతో ఎలా చెప్పాలో నాకు తెలుసు. నువ్వు చెబితే తెలుసుకునేంత స్థితిలో నేను లేను అందట సాయి పల్లవి. ఒక్క సినిమాకే ఫోజులు బాగా ఎక్కువయ్యాయే.. ఇంకా సినిమాలు తీయాలమ్మా.. అంటూ నాని కూడా బాగానే స్పందించాడట. దీంతో సాయి పల్లవి బూతుల పురాణం మొదలుపెట్టిందట. 
 
సినిమా షూటింగ్ సమయంలో దిల్ రాజు లేకపోవడంతో అది కాస్త పెద్దదై సాయిపల్లవి, నానిలు షూటింగ్ మధ్యలోనే వెళ్ళిపోయారని టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. రెండు రోజుల తరువాత దిల్ రాజు స్వయంగా నాని, సాయిపల్లవిలను కలిసి బుజ్జగించారట. కానీ సాయి పల్లవి మాత్రం వెనక్కి తగ్గలేదట. నాని మాత్రం కాస్త వెనక్కి తగ్గి సినిమా షూటింగ్ చేస్తానంటూ ఒప్పుకున్నాడట.

రెండు రోజుల తరువాత పల్లవి కూడా సినిమా షూటింగ్‌లో పాల్గొన్నదట. అయితే వీరి మధ్య ఇప్పటికీ మాటల యుద్థం కొనసాగుతూ ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని బయటకు పొక్కనీయొద్దంటూ సినిమా షూటింగ్ యూనిట్ అందరినీ దిల్ రాజు కోరాడని చెప్పుకుంటున్నారు. కానీ ఆ విషయం కాస్తా అలా.. అలా బయటకు వచ్చేసింది. ఇప్పుడు సినీపరిశ్రమలో వీరి గొడవే హాట్ టాపిక్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: ప్రధాని మోదీని అనికేట్ అని వర్ణించిన పవన్ కల్యాణ్..

Lahore: లాహోర్‌లో శక్తివంతమైన పేలుళ్లు- భద్రత కట్టుదిట్టం

Balochistan: బలూచిస్తాన్‌లో 14మంది పాకిస్థాన్ సైనికులు మృతి.. బాధ్యత వహించిన బీఎల్ఏ (video)

Malala Yousafzai: భారతదేశం-పాకిస్తాన్ దేశాలు సంయమనం పాటించాలి.. మలాలా యూసఫ్ జాయ్

Operation Sindoor impact: పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంటుంది.. ఈ యుద్ధాన్ని చివరి వరకు తీసుకెళ్తాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments