Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరి పైన ఆకాష్ పూరి ఫిర్యాదు..!

డేరింగ్ & డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జగ‌న్నాథ్ తెర‌కెక్కించిన తాజా చిత్రం మెహ‌బూబా. ఈ సినిమా ద్వారా ఆకాష్ పూరిని హీరోగా ప‌రిచ‌యం చేస్తున్నాడు. కొత్త‌మ్మాయి నేహా శెట్టి హీరోయిన్‌గా న‌టించింది. 1971 ఇండో-పాక్ యుద్ధం నేప‌ధ్యంతో రూపొందిన ఈ సినిమాను, మే 11వ

Webdunia
మంగళవారం, 1 మే 2018 (12:55 IST)
డేరింగ్ & డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జగ‌న్నాథ్ తెర‌కెక్కించిన తాజా చిత్రం మెహ‌బూబా. ఈ సినిమా ద్వారా ఆకాష్ పూరిని హీరోగా ప‌రిచ‌యం చేస్తున్నాడు. కొత్త‌మ్మాయి నేహా శెట్టి హీరోయిన్‌గా న‌టించింది. 1971 ఇండో-పాక్ యుద్ధం నేప‌ధ్యంతో రూపొందిన ఈ సినిమాను, మే 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. అంతా బాగానే ఉంది... కానీ.. పూరిపై ఆకాష్ పూరి ఫిర్యాదు చేయ‌డం ఏంటి అనుకుంటున్నారా..?
 
విష‌యం ఏంటంటే... ఇటీవ‌ల‌ ఆకాష్ పూరిని ఈ సినిమాకి నాన్న ఎంత రెమ్యూన‌రేషన్ ఇచ్చారు అని అడిగితే .. "నిజం చెప్పాలంటే మా నాన్న నన్ను హీరోగా పెట్టి సినిమా తీయడమే చాలా ఎక్కువ. అందువలన నేను పారితోషికం గురించి అడగలేదు. నేను అడగలేదు కదా అని ఆయన ఇవ్వలేదు. ఆయన పారితోషికం ఇస్తే మాత్రం తీసుకోవాలని వుంది" అంటూ తన మనసులోని మాటను బయటపెట్టాడు. 
 
ఆ సమయంలో అక్కడే వున్న పూరి .. 'ఈ సినిమా విడుదలైన తరువాత డబ్బులొస్తే, ఆకాష్‌ ఆశించే దానికంటే ఎక్కువ ఇస్తాను' అన్నారు. ఇక ఇటు తండ్రీ .. అటు కొడుకూ ఈ సినిమాపై పెట్టుకున్న నమ్మకం ఎంతవరకూ నిజమవుతుందో తెలియాలంటే మే 11 వ‌ర‌కు ఆగాల్సిందే..!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments