Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ కోర్టును ఆశ్రయించిన అమితాబ్ మనుమరాలు.. ఎందుకో తెలుసా?

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2023 (09:47 IST)
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మనుమరాలు ఆరాధ్య బచ్చన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ - అభిషేక్ బచ్చన్‌ల కుమార్తె అరాధ్య కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో తనపై అవాస్తవాలు వ్యాప్తి చేస్తున్న టాబ్లాయిడ్‌ను నిలువరించాలంటూ అభ్యర్థించారు.
 
తన ఆరోగ్యం, వ్యక్తిగత జీవితంపై ఆ యూట్యూబ్ టాబ్లాయిడ్ తప్పుడు కథనాలు ప్రచురిస్తుందని ఆరాధ్య తన పిటిషన్‌లో పేర్కొంది. తాను మైనర్ అయినందువల్ల ఇలాంటి వార్తల వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని కోర్టును కోరింది. ఈ పిటిషన్‌పై నేడు కోర్టులో విచారణ జరుగనుంది. 
 
కాగా, ఆరాధ్య బచ్చన్‌ గతంలోనూ ట్రోలింగ్‌కు గురైంది. తన వ్యక్తిగత జీవితమే లక్ష్యంగా ఆమెపై ట్రోల్స్ అవాకులు చవాకులు రాసుకొచ్చారు. ఈ తీరుపై అభిషేక్ బచ్చన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రోలింగ్‌కు అస్సలు ఆమోదయోగ్యం కాదు. 
 
ఎవరూ దాన్ని సహించకూడదు. అయితే, ఓ పబ్లిక్ ఫిగర్‌గా ట్రోలింగ్ ఎందుకు జరుగుతుందో నేను అర్థం చేసుకోగలను. కానీ, నా కుమార్తెపై ట్రోలింగ్ ఏ రకంగాను సమర్థనీయం కాదు. ఏమైనా అనాలంటే నేరుగా తననే విమర్శించాలని అభిషేక్ బచ్చన్ కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

"ఆపరేషన్ సింధూర్" అంటే ఏమిటి!

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments