Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్ విక్రయిస్తున్న కన్నడ నటుడు కిషోర్ అమన్ శెట్టి అరెస్టు

Webdunia
ఆదివారం, 20 సెప్టెంబరు 2020 (09:44 IST)
కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లతో సహా మరికొందరిని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నందుకుగాను కన్నడ నటుడు, కొరియోగ్రాఫర్ అయిన కిషోర్ అమన్ శెట్టిని మంగుళూరు పోలీసులు అరెస్టు చేశారు. అమన్ శెట్టి డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ కార్యక్రమంతో మంచి పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత ఏబీసీడీ.. ఎనీ బడీ కెన్ డ్యాస్ చిత్రంలో కూడా నటించాడు. 
 
ఈ విషయాన్ని వెల్లడించిన మంగళూరు సిటీ పోలీసు కమిషనర్ వికాశ్ కుమార్, వీరిద్దరూ మాదకద్రవ్యమైన 'ఎండీఎంఏ'ను విక్రయించేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడ్డారని తెలిపారు. వీరిద్దరూ కలిసి డ్రగ్స్ సంపాదించిన తర్వాత, బైక్‌పై వెళుతూ పట్టుబడ్డారని, రెండో వ్యక్తిని అఖీల్ నౌషీల్‌గా గుర్తించామని తెలిపారు.
 
వీరికి డ్రగ్స్ ముంబై నుంచి వచ్చాయని గుర్తించామని, తదుపరి దర్యాఫ్తు కొనసాగుతోందన్నారు. నిందితుల నుంచి లక్ష రూపాయల విలువ చేసే డ్రగ్స్‌తో పాటు మోటార్ సైకిల్, రెండు మొబైల్ ఫోన్లను సీజ్ చేశామని, ఎన్డీపీఎస్ (నార్కోటిక్ డ్రగ్స్ అండ్సైకోట్రాపిక్ సబ్ స్టాన్సెస్) చట్టం కింద వీరిపై కేసును రిజిస్టర్ చేశామని తెలిపారు. కాగా, ఇదే కేసులో మరో ఇద్దరు విదేశీయులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments