Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు సంఘాల ఫిర్యాదుతో పోలీసుల కేసు.. పరారీలో నటి కస్తూరి

ఠాగూర్
సోమవారం, 11 నవంబరు 2024 (10:21 IST)
రాజులకాలంలో అంతఃపురంలో ఉండే మహిళలకు సేవ చేసేందుకే వచ్చినవారే తెలుగు ప్రజలంటూ వ్యాఖ్యలు చేసిన తమిళ సినీ నటి కస్తూరి ఇపుడు ఇంటి నుంచి పారిపోయారు. ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దీంతో ఆమెపై చెన్నైలోని అనేక తెలుగు సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే, మదురైలోనూ ఆమెపై కేసు నమోదైంది. దీంతో ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. కానీ, ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో ప్రత్యేక బృందం పోలీసులు రంగంలోకి దిగారు. 
 
తమిళ సినీ నటి కస్తూరి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చెన్నై ఆళ్వార్ పేట, పోయెస్ గార్డెన్‌లోని ఇంటికి తాళం వేసి అక్కడ నుంచి పారిపోయారు. ఇటీవల తెలుగు ప్రజల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. రాజుల అంతఃపురంలో ఉండే మహిళలకు సపర్యలు చేసేందుకు వచ్చినవారే తెలుగు ప్రజలని, అలాంటి వారి తమిళ జాతీయులని గొప్పగా చెప్పుకుంటున్నారని, ఎప్పటి నుంచో ఉంటున్న బ్రహ్మణులు మాత్రం ద్రావిడులు కారా అని ఆమె ప్రశ్నించారు. 
 
ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దీంతో నటి కస్తూరిపై రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కేసులు నమోదు కాగా, పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమై చెన్నై పోయెస్ గార్డెన్‌లో ఉన్న ఆమె నివాసానికి వెళ్ళారు. అక్కడ ఆమె ఇంటికి తాళం వేసి, అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు పోలీసులు గుర్తించారు. పైగా, ఆమె మొబైల్ ఫోన్ కూడా స్విచాఫ్ చేసివుంది. 
 
కాగా, ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి చెన్నై, మదురై నగరాల్లో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె తన న్యాయవాది ద్వారా ముందస్తు బెయిల్‌కు ప్రత్యామ్నాయ చేసుకుంటున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Rahul Gandhi: ఇతరులు ఏమి చెబుతున్నారో వినడం నేర్చుకున్నాను.. రాహుల్ గాంధీ

PoK: పెరిగిన జీలం నది నీటి మట్టం- పాకిస్తాన్‌కు వరద ముప్పు..? (video)

Mangoes : మామిడి పండ్లను పండించడానికి కాల్షియం కార్బైడ్‌ను ఉపయోగిస్తే?

Ganta Vs Vishnu : నా నియోజకవర్గంలో వేలు పెడితే సహించేలేది.. స్ట్రాంగ్ వార్నింగ్ (video)

గుర్రంపై ఊరేగింపు: దళిత వరుడిపై దాడి చేసిన ఉన్నత కుల వర్గం.. ఎక్కడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments