Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్టు మెట్లెక్కిన సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ సతీమణి.. ఎందుకు?

"మా" అధ్యక్షుడు, టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ సతీమణి విజయ చాముండేశ్వరి శనివారం కోర్టు మెట్లెక్కారు. ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె కోర్టుకు రావడం వెనుక ఓ చెక్ బౌన్స్ కేసు కావడం గ

Webdunia
శనివారం, 11 ఫిబ్రవరి 2017 (17:02 IST)
"మా" అధ్యక్షుడు, టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ సతీమణి విజయ చాముండేశ్వరి శనివారం కోర్టు మెట్లెక్కారు. ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె కోర్టుకు రావడం వెనుక ఓ చెక్ బౌన్స్ కేసు కావడం గమనార్హం. 
 
కడపకు చెందిన ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్, బిజినెస్‌మేన్‌ జయభరత్ రెడ్డి కేసుపెట్టాడు. గతంలో జయభరత్ రెడ్డి దగ్గర విజయ రూ.25 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఈ అప్పును తిరిగి చెల్లించే నిమిత్తం 2016లో ఆమె ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయి. దీంతో ఆమెపై జయభరత్ రెడ్డి చెక్ బౌన్స్ కేసు పెట్టారు. 
 
ఈ కేసు విచారణ నిమిత్తం ఆమె కోర్టుకు హాజరయ్యారు. అయితే, కేసు విచారణని న్యాయస్థానం ఈ నెల 21కి వాయిదా వేసింది. వరుస సినిమాలతో బిజీగా ఉండే రాజేంద్ర ప్రసాద్ సతీమణి చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు రావడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments