Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటు వేయడానికి డబ్బులు తీసుకోవద్దని విన్నపం.. దొంగ ఓట్లపై నిలదీయాలి : హీరో శివాజీ

వరుణ్
శుక్రవారం, 19 జనవరి 2024 (16:50 IST)
ప్రస్తుత రాజకీయాలపై సినీ హీరో శివాజీ సంచలన కామెంట్స్ చేశారు. సూట్ కేసులు ఇచ్చి బీఫామ్‌లు తెచ్చుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అలాగే, ఓటర్లు కూడా ఓటు వేయడానికి డబ్బులు తీసుకోవద్దని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా కుప్పలు తెప్పలుగా వెలుగు చూస్తున్న దొంగ ఓట్లపై ప్రజలు నిలదీయాలని ఆయన కోరారు. దివంగత ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి తీసుకొచ్చి దోపిడీకి తెరలేపలేదన్నారు. సహజవనరులను దోచుకోమని చెప్పలేదన్నారు. అలాంటి నాయకులు ఇపుడు లేరన్నారు. 
 
అనంతపురంలో జరిగిన ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇందులో ఆయన మాట్లాడుతూ, ఓటు వేయడానికి డబ్బులు తీసుకోవద్దని ప్రజలను కోరారు. డబ్బులు కోసం కాకుండా, మీ బిడ్డల కోసం ఓట్లు వేయాలని కోరారు. మంచి నాయకులను ఎన్నుకున్నపుడే ఎన్టీఆర్‌కు ఘన నివాళి ఇచ్చినట్టు అవుతుందన్నారు. దొంగ ఓట్లపై ప్రజలు నిలదీయాలని సూచించారు. 
 
ఇదేకార్యక్రమంలో మరో సినీ నటుడు నాగినీడు పాల్గొని ప్రసంగిస్తూ, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదాను సాధించడంపై సినీ నటులకు బాధ్యత లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రం కోసం సినీ నటులు తమ వంతు కృషి చేయాలని ఆయన కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments