Webdunia - Bharat's app for daily news and videos

Install App

భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఛాన్సులు.. పెరిగిన యూత్ ఫాలోయింగ్!!

ఠాగూర్
గురువారం, 21 నవంబరు 2024 (14:20 IST)
ఇటీవలి కాలంలో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ చిత్రంలో నటించిన ఈ అందాల బ్యూటీకి తెలుగులో వరుస అవకాశాలు వరిస్తున్నాయి. ఇప్పటివరకు తెలుగు తెరపై మెరిసిన పొడగరి భామలలో ఒకరుగా నిలవడమే ఇందుకు ప్రధాన కారణంగా ఉంది. 'మిస్టర్ బచ్చన్' సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, ఆ సినిమాలో గ్లామర్ పరంగా ఆమె చేసిన మాయజాలాన్ని ప్రేక్షకులు మరిచిపోలేదు.
 
ఈ నేపథ్యంలోనే భాగ్యశ్రీకి రామ్ సినిమాలో ఛాన్స్ దక్కింది. రామ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ - ఫీల్ గుడ్ వారు కలిసి ఒక ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకుని వెళుతున్నారు. గురువారం ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాకి దర్శకత్వం వహించిన మహేశ్ బాబు పి, ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. కెరియర్ పరంగా రామ్‌కి ఇది 22వ సినిమా.
 
కొంతకాలంగా రామ్‌ను వరుస ఫ్లాపులు పలకరిస్తున్నాయి. భారీ అంచనాల మధ్య వచ్చిన 'డబుల్ ఇస్మార్ట్' కూడా ఆయనను కాపాడలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆయన ఈ సినిమాను అంగీకరించాడు. ఈ సినిమా హిట్ రామ్‌తో పాటు భాగ్యశ్రీకి కూడా చాలా అవసరమే. ఈ సినిమాతో హిట్ దొరికితే ఈ సుందరి హవా కొనసాగే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

AP SSC Result 2025: ఏప్రిల్ 22న 10వ తరగతి పరీక్షా ఫలితాలు

పోప్ ప్రాన్సిస్ ఇకలేరు -వాటికన్ కార్డినల్ అధికారిక ప్రకటన

ప్రతిదానికీ హెలికాఫ్టర్ కావాలంటే ఇలానే అవుతాది మరి (Video)

తెలంగాణకు ఎల్లో అలెర్ట్.. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు

వర్షపు నీటిలో తెగిపడిన విద్యుత్ తీగ.. బాలుడిని అలా కాపాడిన యువకుడు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments