Webdunia - Bharat's app for daily news and videos

Install App

డేటింగ్ యాప్‌లో సంపూ హీరోయిన్ ఫోటోలు

Webdunia
బుధవారం, 26 మే 2021 (14:52 IST)
ఇటీవలి కాలంలో సినీ హీరోయిన్ల ఫోటోలను డేటింగ్ యాప్‌లలో పోస్ట్ చేసి, వాటితో డబ్బులు సంపాదించడం చాలా మందికి అలవాటుగా మారింది. ఈ కోవలో ఇపుడు టాలీవుడ్ నటి గీతాంజలి ఫోటోలు కూడో ఓ డేటింగ్ యాప్‌లో దర్శనమిచ్చాయి. దీంతో ఆమె హైదరాబాద్ నగర సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గీతాంజలి ఫోటోలు ఓ డేటింగ్ యాప్‌లో దర్శనమిచ్చాయి. ఈ ఫోటోలను చూసిన ఆమె స్నేహితులు ఖంగుతిని గీతాంజలి దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
దీనిపై ఆమె మాట్లాడుతూ, 'డేటింగ్ యాప్‌లో నా ఫొటోలు ఉన్నట్లు నా స్నేహితురాలు కాల్ చేసి చెప్పేవరకు నాకు తెలీదు. హాట్ లైవ్ డేటింగ్ యాప్‌లో నా ఫొటో ఉన్నట్లు నాకు కాల్స్ రావడం మొదలయ్యాయి. దీంతో నేను వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశా. సెలబ్రిటీల ఫొటోలు పెట్టుకుని డబ్బులు సంపాదించే వారిపై చర్యలు తీసుకోవాలి. ఇంకో అమ్మాయికి ఇలాంటి ఘటనలు జరగకూడదు. ఒక రంగంలో ఎదుగుతుంటే కొందరు కావాలని ఇలా టార్గెట్ చేస్తారు. నాపై వ్యక్తిగతంగా అసూయ పెట్టుకుని ఇలా చేసి ఉంటారని అనుకుంటున్నా. నా అనుమానాలకు తగ్గ ఆధారాలు కూడా ఉన్నాయి. వాటిని పోలీసులకు అందజేశాను. పోలీసులు కేసు నమోదు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులపై నాకు నమ్మకం ఉంది. నిందితులపై కఠిన  చర్యలు తీసుకోవాలని కోరుతున్నా' అంటూ చెప్పుకొచ్చింది. 
 
కాగా, ఈమె గతంలో సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన "కొబ్బరి మట్ట" చిత్రంలో ఓ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంతో గీతాంజలికి మంచి గుర్తింపు వచ్చింది. అందులో సంపూ భార్యల్లో ఒకరిగా నటించిన గీతాంజలి.. పప్పులో చెమటపడుతుందని చెప్పే డైలాగ్‌తో ఫేమస్ అయ్యారు. ఈమె ఇప్పటివరకు 30కి పైగా చిత్రాల్లో నటించారు.   
 
గీతాంజలి 32 సినిమాల్లో నటించారు. ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించారు. అయితే బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన ‘కొబ్బరిమట్ట’ సినిమాతో గీతాంజలికి మంచి గుర్తింపు వచ్చింది. అందులో సంపూ భార్యల్లో ఒకరిగా నటించిన గీతాంజలి.. పప్పులో చెమటపడుతుందని చెప్పే డైలాగ్‌తో ఫేమస్ అయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇన్‌స్టాలో ఫాలోయర్స్ తగ్గారని ఇన్‌ప్లుయెన్సర్ ఆత్మహత్య (Video)

భారత నేవీ త్రిశూల శక్తి - సముద్రంపై - నీటి కింద - అలల మీద...

ఉగ్రవాదులు - అండగా నిలిచేవారు మూల్యం చెల్లించుకోక తప్పదు : ప్రధాని మోడీ వార్నింగ్

Kanpur: యువజంట నూడుల్స్ తింటుంటే దాడి చేశారు.. వీడియో వైరల్

నీకెన్నిసార్లు చెప్పాలి... నన్ను కలవడానికి ఢిల్లీకి రావాలని? లోకేశ్‌కు ప్రధాని ప్రశ్న!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments