Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంతకు అస్వస్థత : ఆ వార్తలు నమ్మొద్దంటున్న బ్యూటీ

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (15:10 IST)
టాలీవుడ్ హీరోయిన్ సమంత సోమవారం స్వల్ప అస్వస్థతకు లోనైనట్టు సమాచారం. ఆదివారం ఆమె కడపలో పర్యటించారు. ఈ జిల్లా కేంద్రంలో కొత్తగా నెలకొల్పిన ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఆమె వెళ్లారు. దీంతో ఆమెను చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఆ తర్వాత కడప పెద్ద దర్గాలో ప్రత్యేక పూజలు చేసిన ఆమె... అక్కడ నుంచి ఆమె హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. 

 
హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాత ఆమె తీవ్రమైన జలుబు, జ్వరంతో బాధపడటంతో ఆమెను గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాథమిక పరీక్షలు చేశారు. అయితే, అంతా బాగానే వుందని, ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలంటూ వైద్యులు సలహా ఇచ్చారు. 

 
అయితే, సోషల్ మీడియాలో మాత్రం ఆమె ఆరోగ్యం గురించి పలు తప్పుడు కథనాలు వచ్చాయి. వీటిని సమంత వ్యక్తిగత సిబ్బంది ఖండించారు. సమంత పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, కొంచెం దగ్గు ఉండటంతో ఆస్పత్రికెళ్లి చికిత్స చేయించుకున్నారంటూ వివరణ ఇచ్చారు. ప్రస్తుంత సమంత ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నట్టు చెప్పారు. దీంతో ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో పాకిస్థాన్ ఎక్కడెక్కడ దాడులు చేస్తుంది? హైదరాబాద్ - వైజాగ్‌లు ఏ కేటగిరీలో ఉన్నాయి?

రిజర్వేషన్ వ్యవస్థ రైలు కంపార్టుమెంట్‌లా మారిపోయింది : సుప్రీం జడ్జి సూర్యకాంత్

భారతదేశం-పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరుగుతుందా?

Jagan Padayatra 2.0 : 2027లో పాదయాత్ర 2.0 చేపడతారు.. గుడివాడ అమర్‌నాథ్

భారత్ దెబ్బకు ఎండిపోతున్న పాక్ నదులు... ఖరీఫ్ సీజన్ నుంచే నీటి కటకటా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments