Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్-3 ఫేం దర్శన్ వాడుకుని వదిలేశాడంటున్న తమిళ సినీ నటి! (Video)

Webdunia
మంగళవారం, 6 అక్టోబరు 2020 (14:56 IST)
తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ సినీ నటి చెన్నై పోలీసులను ఆశ్రయించింది. తనను బిగ్ బాస్-3 తమిళ ఫేం దర్శన్ త్యాగరాజన్ మోసం చేశాడని ఆరోపించింది. ఒక యేడాది రిలేషన్ పేరుతో తనను వాడుకుని ఇపుడు వదిలేశాడనీ ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు... ఆ దర్శకుడి కోసం గాలిస్తున్నారు. 
 
ఇంతకీ పోలీసులకు ఫిర్యాదు చేసిన తమిళ నటి సనమ్ శెట్టి. ఈమె మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. 
 
కాలక్రమంలో ఆమెకు బిగ్ బాస్-3 ఫేం దర్శన్‌ త్యాగరాజన్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇది కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత వారిద్దరూ ఒక యేడాది పాటు సహజీవనం చేశారు. ఆ తర్వాత ఏమైందో కానీ సనమ్‌తో దర్శన్ బంధాలను తెంచుకున్నాడు. దీంతో సనమ్ పోలీసులను ఆశ్రయించింది.
 
మలేషియాలో ఉంటున్న దర్శన్ తనను ప్రేమిస్తున్నానని చెప్పి, మోసగించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు చెన్నైలోని అడయార్ పోలీస్ స్టేషనులో ఆమె ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్శన్ కోసం గాలిస్తున్నారు.
 
తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి, మోసం చేశాడని తన ఫిర్యాదులో సనమ్ పేర్కొంది. అతడిని కఠినంగా శిక్షించాలని కోరింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్శన్ కోసం గాలిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత నేవీ త్రిశూల శక్తి - సముద్రంపై - నీటి కింద - అలల మీద...

ఉగ్రవాదులు - అండగా నిలిచేవారు మూల్యం చెల్లించుకోక తప్పదు : ప్రధాని మోడీ వార్నింగ్

Kanpur: యువజంట నూడుల్స్ తింటుంటే దాడి చేశారు.. వీడియో వైరల్

నీకెన్నిసార్లు చెప్పాలి... నన్ను కలవడానికి ఢిల్లీకి రావాలని? లోకేశ్‌కు ప్రధాని ప్రశ్న!

Hyderabad: నెలవారీ బస్ పాస్ హోల్డర్ల కోసం మెట్రో కాంబో టికెన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments