Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఆఫర్లు వచ్చాయి.. కోట్లిస్తానన్నారు.. కానీ వద్దన్నాను?

Webdunia
శనివారం, 11 జనవరి 2020 (13:41 IST)
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ అల.. వైకుంఠపురములో. ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు ఈ సినిమాని నిర్మించాయి. ఇందులో బన్నీ సరసన పూజా హేగ్డే నటించింది. ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్ సక్సస్ అవ్వడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సంక్రాంతి కానుకగా ఈ నెల 12 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
ఇదిలా ఉంటే... ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బన్నీ ఎలా మాట్లాడాడో... అందరికీ తెలిసిందే. బన్నీ అంతలా మాట్లాడడం హాట్ టాపిక్ అయ్యింది. నాన్న గురించి మాట్లాడడం... నాన్న అల్లు అరవింద్ కు పద్మశ్రీ ఇవ్వాలి అనడం చర్చనీయాంశం అయ్యాయి. వీటి గురించి అడిగితే... అలా మాట్లాడేసాను అంతే. ఏదీ ప్లాన్ చేసి మాట్లాడలేదు అన్నాడు. ఇది సరే... స్టేజ్ పై డ్యాన్స్ వేయడం గురించి అడిగితే... అసలు డ్యాన్స్ చేయాలని అనుకోలేదట.
 
ఫ్యాన్స్‌ని చూడగానే.. ఉత్సాహం అలా వచ్చేసింది. పాట పెట్టమని డ్యాన్స్ చేసేసాను అన్నాడు. ఈ సందర్భంగా మరో విషయాన్ని కూడా బయటపెట్టాడు అల్లు అర్జున్. ఇంతకీ మేటర్ ఏంటంటే...  స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఆఫర్లు తనకు చాలా వచ్చాయట. కోట్ల రూపాయలు ఇస్తామని ఆఫర్లు కూడా ఇచ్చారని, కానీ... తను వాటిని రిజెక్ట్ చేశానని చెప్పుకొచ్చాడు. తనకు నచ్చితేనే స్టేజ్ పై డాన్స్ చేస్తానని స్పష్టం చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments