Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నా పేరు సూర్య'గా అల్లు అర్జున్ ... మే 4న ప్రేక్షకుల ముందుకు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించే తాజా చిత్రం "నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా". ఈచిత్రానికి వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఒక్క పాట మినహా మిగతా చిత్రీకరణ పూర్తయింది. త్వరలో

Webdunia
మంగళవారం, 3 ఏప్రియల్ 2018 (10:17 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించే తాజా చిత్రం "నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా". ఈచిత్రానికి వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఒక్క పాట మినహా మిగతా చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే ఈ పాటను కూడా పూర్తిచేయనున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆడియో ఫంక్షన్ గురించి బన్నీ అభిమానులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 15వ తేదీన ఆడియో రిలీజ్ పెట్టుకుంటే బాగుంటుందని ఈ సినిమా దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. అయితే, ఆ రోజు వీలుపడుతుందా లేదా అన్నదానిపై సందిగ్ధత ఇంకా వీడలేదు. 
 
మరోవైపు, ఈ చిత్రం ఆడియో ఫంక్షన్‌ ఎక్కడ నిర్వహించాలన్నదానిపై కూడా చర్చిస్తున్నారు. భాగ్యనగరంలో ఈ ఫంక్షన్ జరిపితే రొటీన్‌గా ఉంటుందనీ అందువల్ల వైజాగ్‌లో జరుపుదామని అనుకుంటే .. ఇంతకుముందే అక్కడ 'రంగస్థలం' ఫంక్షన్ జరిపారు. అందువలన అల్లు అర్జున్ చిత్రం ఆడియో  వేడుకను 'తిరుపతి'లోగానీ .. కర్నూల్‌లోగాని జరపాలనే ఆలోచనలో ఉన్నారట. ఈ సంగతి పక్కనబెడితే చిత్రం మాత్రం మే 4వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments