Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌భాస్‌ను అమిత్‌షా క‌ల‌వ‌బోతున్నారు

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2022 (10:38 IST)
Prabhas, Amit Shah
ఇటీవ‌లే టాలీవుడ్ స్టార్ ఎన్‌.టి.ఆర్‌.ను హైద‌రాబాద్ వ‌చ్చి ప్ర‌త్యేకంగా క‌లిసిన బిజెపి అగ్ర నేత అమిత్ షా ఆ త‌ర్వాత హీరో నితిన్‌ను కూడా క‌లిశారు. ఇప్పుడు తాజాగా ప్ర‌భాస్‌ను క‌ల‌వ‌నున్నారు. అందుకోసం ప్ర‌భాస్ రేపు అన‌గా 16వ తేదీన షూటింగ్‌ను విర‌మించుకుని హైద‌రాబాద్‌లో ఇంటి వ‌ద్ద‌నే వుండ‌నున్నారు. ముఖ్యంగా కృష్ణంరాజు మ‌ర‌ణం త‌ర్వాత ఆయ‌న్ను క‌ల‌వాల‌నుకున్నా సాధ్య‌ప‌డ‌లేదు. అందుకే ప్ర‌త్యేకంగా రేపు అనగా 16వ తేదీ శుక్ర‌వారంనాడు క‌ల‌వ‌నున్న‌ట్లు ప్ర‌భాస్‌కు సందేశాన్ని అంద‌జేశారు.
 
బిజెపి పార్టీకి సంబంధించిన ప‌లు కార్య‌క్ర‌మాల్లో భాగంగా హైద‌రాబాద్ వ‌స్తున్న అమిత్ షా ప్ర‌త్యేకంగా టైం తీసుకుని ప్ర‌భాస్‌ను క‌ల‌సి ప‌రామ‌ర్శించ‌నున్నారు. కృష్ణంరాజు ఇప్ప‌టికే బిజెపి పార్టీ కార్య‌క‌ర్త‌గా వున్నారు. మ‌ధ్య‌లో చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీలోకి వెళ్ళారు. అది చారిత్రాత్మ‌క త‌ప్పిదంగా ఆయ‌న ఆ త‌ర్వాత వెల్ల‌డించారు. ఆ త‌ర్వాత బిజెపిలో కొన‌సాగారు కృష్ణంరాజుగారు.  రేపు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకోనున్న అమిత్ షా, అనంతరం కృష్ణంరాజు గారి ఇంటికి వెళ్లి ఆయన సతీమణి శ్యామల గారిని, హీరో ప్రభాస్ ని కలిసి నివాళులు అర్పించనున్నట్లు ప్ర‌క‌ట‌న వెల‌వ‌డింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశం దాడులతో పాకిస్తాన్ కకావికలం: బంకర్‌లో దాక్కున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి

INS Vikrant గర్జన: పాకిస్తాన్ లోని కరాచీ పోర్టు నేలమట్టం (video)

జమ్మూపై పాకిస్తాన్ క్షిపణి, డ్రోన్ దాడులు: పాక్ 2 JF17 ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత సైన్యం

Anantapur MP: అనంతపురం ఎంపీ సోదరి హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి

Telangana: ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తున్నాం.. భట్టి విక్రమార్క

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments