Webdunia - Bharat's app for daily news and videos

Install App

'దొరసాని' రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది!

Webdunia
గురువారం, 27 జూన్ 2019 (13:15 IST)
అటు సినీ పరిశ్రమలోనూ, ఇటు ప్రేక్షకులలోనూ తీవ్ర ఆసక్తిని రేకెత్తించిన 'దొరసాని' జులై 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా, రాజశేఖర్ జీవితల కుమార్తె శివాత్మిక హీరోయిన్‌గా పరిచయం అవుతూ... మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా నిర్మాణ అనంతర కార్యక్రమాలను పూర్తిచేసుకొని గ్రాండ్ రిలీజ్‌కి సిద్దం అవుతోంది. ఈ చిత్రానికి దర్శకుడిగా కె.వి.ఆర్ మహేంద్ర పరిచయం అవుతున్నాడు.
 
80వ దశకంలో తెలంగాణా ప్రాంతంలో జరిగిన ఒక స్వచ్ఛమైన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా... టీజర్ ఇప్పటికే రిలీజ్ కాగా.. 'నింగిలోన పాలపుంత నవ్వులొంపెనే' పాట దొరసానిపై అంచనాలను పెంచాయి. మరోపాట 'కలవరమై.. కలవరమై' ఈనెల 24న రిలీజ్ కానుంది. కల్మషం లేని ప్రేమకథగా తెరకెక్కిన ‘దొరసాని’ ప్రేమకథలలో ప్రత్యేకస్థానంలో నిలుస్తుందంటున్నారు దర్శక నిర్మాతలు. మరి ఈ దొరసాని వారి ఆశలను ఎంత మేరకు నెరవేర్చుతుందో వేచి చూద్దాం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

Golden Hour: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్య చికిత్స - గోల్డెన్ అవర్ సమయంలో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments