Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడ్డుపడిన మాంసపు ముక్క... గాల్లో కలిసిన ప్రాణాలు...

కొన్ని మరణాలు వినేందుకు ఒకింత ఆశ్చర్యంగా ఉంటాయి. అలాంటి మరణం ఒకటి అనంతపురం జిల్లాలో సంభవించింది. మాంసపు ముక్క గొంతులో ఇరుక్కోవడంతో ఓ ఫీల్డ్ అసిస్టెంట్ ప్రాణాలు కోల్పోయాడు. అనంతపురం జిల్లా రాయదుర్గం రూ

Webdunia
గురువారం, 9 ఆగస్టు 2018 (15:06 IST)
కొన్ని మరణాలు వినేందుకు ఒకింత ఆశ్చర్యంగా ఉంటాయి. అలాంటి మరణం ఒకటి అనంతపురం జిల్లాలో సంభవించింది. మాంసపు ముక్క గొంతులో ఇరుక్కోవడంతో ఓ ఫీల్డ్ అసిస్టెంట్ ప్రాణాలు కోల్పోయాడు. అనంతపురం జిల్లా రాయదుర్గం రూరల్ మండలంలో ఈ ఘటన జరిగింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మండలంలోని ఆవులదట్ల గ్రామంలో ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా రామాంజనేయులు (35) అనే వ్యక్తి పని చేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం కూలీలంతా భోజనానికి వచ్చారు. వారితో పాటు ఈయన కూడా ఇంటికి వచ్చి భోజనం చేయసాగాడు. 
 
అపుడు ఓ మాంసం ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఆయన విలవిల్లాడి అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆవులదట్ల ప్రాథమిక వైద్య కేంద్రానికి తీసుకెళ్ళినా ప్రయోజనం లేకుండా పోయింది. 
 
విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ నాగరాజు, ఎంపీడీవో శ్రీనివాసులు, ఏ పీవో అప్పస్వామినాయుడు ఆస్పత్రికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. సకాలంలో వైద్యం అంది ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని కుటుంబ సభ్యులు వాపోయారు. మృతుడు రా మాంజినేయులుకు భార్య లక్ష్మీదేవితో పాటు ఇద్దరు సంతానం ఉన్నట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశం దాడులతో పాకిస్తాన్ కకావికలం: బంకర్‌లో దాక్కున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి

INS Vikrant గర్జన: పాకిస్తాన్ లోని కరాచీ పోర్టు నేలమట్టం (video)

జమ్మూపై పాకిస్తాన్ క్షిపణి, డ్రోన్ దాడులు: పాక్ 2 JF17 ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత సైన్యం

Anantapur MP: అనంతపురం ఎంపీ సోదరి హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి

Telangana: ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తున్నాం.. భట్టి విక్రమార్క

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments