Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనసూయ సోషల్ మీడియాకు నమస్కారం పెట్టేసింది..

యాంకర్, నటి అనసూయ సోషల్ మీడియాకు దూరమైంది. హైదరాబాద్ తార్నాకకు కారులో వెళ్తుండగా.. ఓ బాలుడు సెల్ఫీ తీసుకునేందుకు రావడంతో.. అసహనానికి గురైన అనసూయ.. బాలుడి ఫోన్‌ను నేలకేసి కొట్టింది. దీనిపై సోషల్ మీడియా

Webdunia
బుధవారం, 7 ఫిబ్రవరి 2018 (14:16 IST)
యాంకర్, నటి అనసూయ సోషల్ మీడియాకు దూరమైంది. హైదరాబాద్ తార్నాకకు కారులో వెళ్తుండగా.. ఓ బాలుడు సెల్ఫీ తీసుకునేందుకు రావడంతో.. అసహనానికి గురైన అనసూయ.. బాలుడి ఫోన్‌ను నేలకేసి కొట్టింది. దీనిపై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరిగింది. బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫోన్‌ను పగులకొట్టడమే కాకుండా.. దుర్భాషలాడిందని ఆ ఫిర్యాదులో పేర్కొంది. 
 
కానీ ఈ వ్యవహారంపై అనసూయ క్లారిటీ ఇచ్చింది. ఫోన్ పగులకొట్టినందుకు క్షమాపణలు కూడా అడిగింది. కానీ ఫోన్ పగిలిందా లేదా అని తాను గమనించలేదని చెప్పింది. ఇంతలో ట్విట్టర్లో ఓ యువకుడు అనసూయ ఫోన్ పగులకొట్టడాన్ని తాను చూశానని ట్వీట్ చేశాడు. ఆ యువకుడి వద్ద విచారిస్తామని పోలీసులు కూడా హామీ ఇచ్చారు. దీంతో నెటిజన్లు అనసూయపై తిట్ల వర్షం కురిపించారు. 
 
క్షమాపణలు చెప్పినా చిన్నారి అభిమాని ఫోన్ పగులకొట్టిన వ్యవహారంపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వేళ.. అనసూయ ఓ నిర్ణయానికి వచ్చేసింది. అంతే సోషల్ మీడియా వద్దు ఏమీ వద్దు అనుకుంది. నెటిజన్ల విమర్శలకు మనస్తాపానికి గురైన అనసూయ తన సోషల్ మీడియా అకౌంట్లను డిలీట్ చేసింది. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో అనసూయ అకౌంట్స్ కనిపించట్లేదు. మొత్తానికి సెల్ ఫోన్ వ్యవహారంతో అనసూయ హర్టయ్యిందని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. ఈ వ్యవహారంలో నెటిజన్లు ఓవరాక్షన్ చేశారని వారు మండిపడుతున్నారు.
 
ఇకపోతే.. బుల్లితెరపై టీవీ షోలతో బిజీగా ఉన్న అనసూయ ప్రస్తుతం రామ్‌ చరణ్ రంగస్థలం, మోహన్ బాబు గాయత్రి సినిమాలతో పాటు శ్రీనివాస్‌ రెడ్డి హీరోగా తెరకెక్కుతున్న ''సచ్చిందిరా గొర్రె'' సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments