Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ బయోపిక్ : స‌రోజా దేవి పాత్ర కోసం అనుష్క‌

Webdunia
బుధవారం, 7 నవంబరు 2018 (11:55 IST)
స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదలకానుంది. 'ఎన్టీఆర్ కథానాయకుడు', 'ఎన్టీఆర్ మహానాయకుడు' అనే పేర్లతో ఈ చిత్రం రానుంది. 
 
ఈ చిత్రంలో తొలి భాగం జనవరి 9వ తేదీన, రెండో భాగం జనవరి 24వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన వ‌స్తున్న వార్త‌లు ప్రేక్ష‌కుల‌కి అమితానందాన్ని క‌లిగిస్తుంది. ఇప్ప‌టికే ఎన్టీఆర్ సినిమాలోని ముఖ్య పాత్ర‌ల కోసం పలువురు స్టార్స్‌ని ఎంపిక చేసిన చిత్ర బృందం అనుష్క శెట్టిని కూడా కీల‌క పాత్ర కోసం ఎంపిక చేశారట. 
 
ఎన్టీఆర్ సరసన బి.సరోజాదేవి చాలా చిత్రాల్లో కలిసి నటించారు. అందులో చాలా వరకు సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. ఆ చిత్రాలకు సంబంధించిన కొన్ని విషయాలను ఈ బయోపిక్‌లో చూపిస్తున్నారట. ఈ క్ర‌మంలో స‌రోజా దేవి పాత్ర కోసం అనుష్క‌ని తీసుకున్నార‌ట‌. అతి త్వ‌ర‌లో ఈ విష‌యాన్ని అధికారికంగా ధృవీక‌రించ‌నున్నార‌ని అంటున్నారు. 
 
అనుష్క చివ‌రిగా 'భాగ‌మ‌తి' చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఆ మూవీ త‌ర్వాత ఏ సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌క‌పోవ‌డం విశేషం. మ‌రి ఎన్టీఆర్‌తో అనుష్క ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రిస్తుంద‌ని వ‌స్తున్న వార్త‌ల‌లో నిజ‌మెంత ఉంద‌నేది తెలియాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments