Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అర్జున్ రెడ్డి' నటితో హీరో విశాల్ పెళ్లి... వరలక్ష్మి సంగతేంటి?

Webdunia
బుధవారం, 16 జనవరి 2019 (09:48 IST)
కోలీవుడ్ హీరో, తమిళ చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ త్వరలోనే ఓ ఇంటివాడు కానున్నాడు. హీరో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం 'అర్జున్ రెడ్డి'. ఈ చిత్రంలో కీర్తి పాత్రలో నటించిన అమ్మాయి అనీషా రెడ్డి. ఈమెను విశాల్ పెళ్లి చేసుకోనున్నాడు. 
 
ఈ విషయాన్ని విశాల్ తండ్రి జీకే రెడ్డి స్వయంగా వెల్లడించగా, అనీషా రెడ్డి కూడా తమ పెళ్లి వార్తను ధృవీకరించింది. ఇందుకు సంబంధించి తాను, విశాల్ కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇపుడు ఈ ఫోటో వైరల్‌గా మారింది. 
 
అనీషా విషయానికి వస్తే.. హైదరాబాద్‌ బిజినెస్‌మేన్‌ విజయ్‌ రెడ్డి, పద్మజ దంపతుల కుమార్తె. ఈమె 'అర్జున్‌ రెడ్డి', 'పెళ్లి చూపులు' వంటి చిత్రాల్లో నటించారు. 'అర్జున్‌ రెడ్డి' సినిమాలో ఆమె కీర్తి పాత్రని పోషించారు. ఇకపై ఆమె సినిమాల్లో కొనసాగే అవకాశం లేనట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా విశాల్‌పై తనకున్న ఇష్టాన్ని, నమ్మకాన్ని కూడా ఆమె వెల్లడించారు. 
 
మరోవైపు, సినీ నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి శరత్ కుమార్‌తో విశాల్ ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. వీరిద్దరి పెళ్లికి శరత్ కుమార్ దంపతులు కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే, అవన్ని వట్టి పుకార్లేనని ఈ తాజా ప్రకటనతో తేలిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: 25 వైమానిక మార్గాలను నిరవధికంగా మూసివేసిన భారత్

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments