Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాసరి నారాయణ రావు రెండో కుమారుడుపై అట్రాసిటీ కేసు

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (13:08 IST)
ప్రముఖ దర్శకుడు దివంగత దాసరి నారాయణరావు రెండో కుమారుడు దాసరి అరుణ్‌పై బంజారా హిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో అట్రాసిటీ కేసు న‌మోదైంది. తెలంగాణా ప్రాంతానికి చెందిన న‌ర్సింహులు అనే వ్య‌క్తి ఈ కేసు పెట్టారు. ఈయన దాసరి నారాయ‌ణ‌రావు వ‌ద్ద కొన్నేళ్లుగా పని చేశారు. 
 
ఆ ప‌నికి ఇవ్వాల్సిన డబ్బుల విష‌యంలో వివాదం కొన‌సాగుతోంది. డ‌బ్బులు ఇస్తామ‌ని ఇంటికి పిలిచి కులం పేరుతో దాసరి అరుణ్ త‌న‌ను దూషించాడ‌ని రెండురోజుల ముందు న‌ర్సింహులు బంజారా హిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు 
 
దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. గత నెలలో దాసరి ఇద్దరు కుమారులపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఆర్థిక పరమైన లావాదేవీలపై తనను బెదిరించినట్లు సోమేశ్వర్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు సద్దుమణిగిపోయింది. ఇపుడు మళ్ళీ దాసరి అరుణ్‌పై అట్రాసిటీ కేసు నమోదు కావడం గమనార్హం. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

దేశం కోసం చనిపోతా.. మృతదేహంపై జాతీయ జెండా ఉంచండి... మురళీ నాయక్ చివరి మాటలు (Video)

సింధూ జలాల ఒప్పందం రద్దులో జోక్యం చేసుకోం : తేల్చి చెప్పిన ప్రపంచ బ్యాక్ చీఫ్

పాక్ వైమానిక దాడులను భగ్నం చేసేందుకు క్షిపణులు సన్నద్ధం చేసిన భారత్

సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్తత - ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments