బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

ఠాగూర్
శుక్రవారం, 18 ఏప్రియల్ 2025 (22:37 IST)
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బద్రీనాథ్‌లో తనకు గుడి వుందని అందువల్ల తన అభిమానులు దక్షిణాదిలో కూడా తనకు ఓ గుడి కట్టాలంటూ బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా చేసిన వ్యాఖ్యలు ఇపుడు వివాదాస్పదమయ్యాయి. బద్రీనాథ్‌లో తనకు ఓ గుడి కట్టారని, అందువల్ల బద్రీనాథ్ వెళ్లిన భక్తులు తన గుడిని కూడా సందర్శించాలంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై బద్రీనాథ్‌లోని పలువురు పూజారులు మండిపడుతున్నారు. ఊర్వశికి బద్రీనాథ్‌లో గుడి లేదూ గాడిద గుడ్డూ లేదంటున్నారు. నటి ఊర్వశి ప్రతి ఒక్కరినీ తప్పుదారి పట్టిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఊర్వశీ రౌతేలా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఉత్తరాఖండ్‌లో తన పేరుమీద ఓ ఆలయం ఉంది. బద్రీనాథ్‌కు ఎవరైనా వెళితే పక్కనే ఉన్న నా ఆలయాన్ని సందర్శించండి. ఢిల్లీ వర్శిటీలో కూడా నా ఫోటుకు పూలమాలలు వేసి నన్ను దండమమాయి అని పిలుస్తుంటారు అని వ్యాఖ్యానించారు. 
 
ఈ వ్యాఖ్యలపై అర్చకులు లేదా పూజారులు మండిపడుతున్నారు. బద్రీనాథ్ సమీపంలోని బామ్నిలో ఊర్వశి పేరుతో ఆలయం ఉన్న మాట వాస్తవమేనని, అయితే, ఆ ఆలయానికీ నటికి సంబంధం లేదని తెలిపారు. పురాణాలు, స్థానికుల నమ్మకం ప్రకారం శ్రీమహావిష్ణువు తొడ నుంచి ఉద్భవించడం లేదా సతీదేవి శరీర భాగం పడిన ప్రదేశం ఊర్వశీదేవి ఆలయంగా మారిందని చెబుతుంటారు. నటి ఊర్వశీ మాత్రం ఆలయం తన పేరుమీద ఉందని ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. 
 
పైగా ఇలాంటి వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, ఊర్వశీ వ్యాఖ్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఎవరైనా ఇలాంటి మాటలు మాట్లాడితే కఠినంగా వ్యవహించాల్సిందే" అని అన్నారు. ఇది మత విశ్వాసాలను అగౌరవపరచడమే అని బ్రహ్మకపాల్ తీర్థ్ పురోహిత్  సొసైటీ అధ్యక్షుడు అమిత్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ నెయ్యి కేసు: తితిదే జీఎం కె సుబ్రహ్మణ్యం అరెస్ట్, వైవీ సుబ్బారెడ్డిని కూడానా?

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments