Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ బ‌యోపిక్ ఎనౌన్స్ చేసిన బాల‌య్య‌ (Video)

నంద‌మూరి తార‌క రామారావు జీవిత కథ ఆధారంగా ‘ఎన్.టి.ఆర్’ చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ నిర్మిస్తోన్న‌ విషయం తెలిసిందే. డైరెక్ట‌ర్ తేజ ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకోవ‌డంతో ‘ఎన్.టి.ఆర్’ చిత్రానికి తదుపరి దర్శకుడు ఎవరనేది ఆస‌క్తిగా మారింది. దీంతో ర‌క‌ర‌కాల ద‌ర్

Webdunia
సోమవారం, 28 మే 2018 (15:13 IST)
నంద‌మూరి తార‌క రామారావు జీవిత కథ ఆధారంగా ‘ఎన్.టి.ఆర్’ చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ నిర్మిస్తోన్న‌ విషయం తెలిసిందే. డైరెక్ట‌ర్ తేజ ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకోవ‌డంతో ‘ఎన్.టి.ఆర్’ చిత్రానికి తదుపరి దర్శకుడు ఎవరనేది ఆస‌క్తిగా మారింది. దీంతో ర‌క‌ర‌కాల ద‌ర్శ‌కుల పేర్లు తెర పైకి వ‌చ్చాయి. ఈ విషయమై జ‌రిగిన ప్ర‌చారానికి నందమూరి బాలకృష్ణ ఫుల్‌స్టాప్ పెట్టారు. 
 
బాలయ్య వందో చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’కి దర్శకత్వం వహించిన క్రిష్‌కు ఈ బాధ్యతలు అప్పగించినట్టు బాలకృష్ణ తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. అంతేకాకుండా, ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు. ‘జనని భారత మెచ్చజగతి హారతులెత్త జనశ్రేణి ఘనంగా దీవించి నడుపగా రణభేరి మ్రోగించే తెలుగోడు జయగీతి నినదించె మొనగాడు.. ‘ఎన్.టి.ఆర్’ .. అంటూ ఈ వీడియోలో బాలకృష్ణ వాయిస్ ఓవర్ చెప్పారు. 
 
‘నాటి రామకథను ఆ రాముడి బిడ్డలైన లవకుశలు చెప్పారు. నేటి రామకథను ఈ రాముడి బిడ్డలమైన మేము చెబుతున్నాం. చేసే ప్రతి పనిలో ప్రాణముంటుంది. ప్రతి ప్రాణానికి ఒక కథ ఉంటుంది. ఈ కథ ఎవరు చెప్పాలని రాసుందో, ఈ రామాయణానికి వాల్మీకి ఎవరో ఇప్పుడు తెలిసింది! నా నూరవ చిత్రాన్ని చరితగా మలిచిన క్రిష్ జాగర్లమూడి.. ఈ చరిత్రకు చిత్ర రూపాన్ని ఇస్తున్నారని ఆనందంతో తెలియజేస్తున్నా. 
 
ఇది, మా కలయికలో రెండో దృశ్య కావ్యం. మరో అఖండ విజయానికి అంకురార్పణ. నాన్నగారి ఆత్మ ఆశీర్వదిస్తుంది.. మీ అందరి అభిమానం మమ్మల్ని నడిపిస్తుంది. ప్రతి నిమిషం మీ కుశలాలు కాంక్షించే.. మీ నందమూరి బాలకృష్ణ’ అని ఈ వీడియోలో బాలయ్య పేర్కొన్నారు. చూడండి ఈ వీడియోను...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జమ్మూపై పాకిస్తాన్ క్షిపణి, డ్రోన్ దాడులు: పాక్ 2 JF17 ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత సైన్యం

Anantapur MP: అనంతపురం ఎంపీ సోదరి హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి

Telangana: ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తున్నాం.. భట్టి విక్రమార్క

Balochistan: పాకిస్తాన్‌కు వీడ్కోలు, బలూచిస్తాన్‌కు స్వాగతం.. పాక్ జెండాలు దిగిపోయాయ్

Jagan Predicts: 2029లో కాదు, ఎప్పుడైనా ఎన్నికలు జరగవచ్చు: జగన్మోహన్ రెడ్డి జోస్యం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments