Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయప్రకాష్ రెడ్డి కుటుంబానికి బాలయ్య ఆర్థిక సాయం?

Webdunia
బుధవారం, 9 సెప్టెంబరు 2020 (15:15 IST)
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు జయప్రకాష్ రెడ్డి మంగళవారం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు కూడా గుంటూరులో మంగళవారం సాయంత్రమే పూర్తి చేశారు. జేపీ మృతిపట్ల టాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర తిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. అసలు జేపీ చనిపోయారంటే.. టాలీవుడ్ సినీ ప్రముఖులు ఎవరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.
 
మెగాస్టార్ చిరంజీవి అయితే.. అపుడే మమ్మల్ని వదిలి వెళ్లిపోయావా మిత్రమాంటూ ట్వీట్ చేశారు. జేపీ లేని లోటును తీర్చలేమని వ్యాఖ్యానించారు. పైగా, ఆయన మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, అలాగే, అనేక మంది రాజకీయ సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలిపారు. 
 
ఈ క్రమంలో తెలుగు సీనియర్ హీరో బాలకృష్ణ సైతం జేపీ మృతిపై స్పందించారు. మంచి ఆత్మీయుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో చిత్రాలలో ఇద్దరం కలిసి నటించామని చెప్పారు. సినీ రంగాన్ని, నాటక రంగాన్ని రెండు కళ్లుగా భావించేవారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. అలాగే, జేపీ కుటుంబానికి బాలయ్య రూ.10 లక్ష ఆర్థిక సాయం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
అయితే, ఈ విషయాన్ని బాలయ్య అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. బాలయ్యతో కలిసి జయప్రకాష్ రెడ్డి పలు చిత్రాల్లో నటించారు. వీరిద్దరు కలిసి నటించిన నరసింహానాయుడు, సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి వంటి అనేక చిత్రాలు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vijaysai Reddy: తిరుమల దర్శనం.. మొక్కులు- బీజేపీలో చేరనున్న విజయ సాయిరెడ్డి? (video)

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి స్వల్ప అస్వస్థత.. ఏమైందంటే? (video)

ఆలయంలోకి వచ్చాడని దళిత యువకుడిని నగ్నంగా ఊరేగించారు.. ఎక్కడ?

WAVES సమ్మిట్‌- ఏపీకి ఏఐ సిటీ.. రూ.10వేల కోట్లతో డీల్ కుదిరింది

AP: ఏపీలో మే 6 నుంచి జూన్ 13 వరకు ఆన్‌లైన్ ఎంట్రన్స్ పరీక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments