Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆ డైరెక్ట‌ర్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడా..?

Webdunia
శుక్రవారం, 4 జనవరి 2019 (14:17 IST)
అల్లుడు శీను సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మై.. తొలి చిత్రంతోనే ఘ‌న విజ‌యం సాధించిన యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. అల్లుడు శీను త‌ర్వాత స్పీడున్నోడు, జ‌య జాన‌కి నాయ‌క‌, సాక్ష్యం, క‌వ‌చం... ఇలా వ‌రుస‌గా వైవిధ్య‌మైన చిత్రాల్లో న‌టించాడు. కానీ... ఆశించిన స‌క్స‌ెస్ సాధించ‌లేక‌పోప‌యాడు. ప్ర‌స్తుతం తేజ దర్శకత్వంలో సీత అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇదిలా ఉంటే... సాయి శ్రీనివాస్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా కొత్త చిత్రాన్ని ఎనౌన్స్ చేసాడు. 
 
ఈ చిత్రానికి రమేష్ వర్మ దర్శకత్వం వ‌హించ‌నున్నారు. ఈచిత్రంలో సాయి గడ్డంతో కొత్త లుక్‌లో కనిపించనున్నాడు. సత్యనారాయణ కోనేరు మరియు హవీష్ లక్ష్మణ్ కోనేరు నిర్మించనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాతో పాటు సాయి శ్రీనివాస్ మ‌రో డైరెక్ట‌ర్‌కి కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. 
 
ఇంత‌కీ ఎవ‌రా డైరెక్ట‌ర్ అంటే... ఆర్ఎక్స్ 100 సినిమాతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన అజ‌య్ భూప‌తి. అవును.. ఇటీవ‌ల అజ‌య్.. సాయి శ్రీనివాస్‌కి క‌థ చెప్ప‌డం... క‌థ విని ఓకే చెప్ప‌డం జ‌రిగింద‌ని టాక్ వినిపిస్తోంది. మ‌రి... ఈ సినిమాని త్వ‌ర‌లో ఎనౌన్స్ చేస్తారేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments