Webdunia - Bharat's app for daily news and videos

Install App

'భరత్ అనే నేను'.. రోజువారీ లెక్కలు తిరగరాస్తున్నా...

ప్రిన్స్ మహేష్ బాబు, కైరా అద్వానీ జంటగా, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన చిత్రం "భరత్ అనే నేను". ఈ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ ద‌క్కించు

Webdunia
శనివారం, 21 ఏప్రియల్ 2018 (11:39 IST)
ప్రిన్స్ మహేష్ బాబు, కైరా అద్వానీ జంటగా, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన చిత్రం "భరత్ అనే నేను". ఈ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ ద‌క్కించుకుంది. 
 
ప్ర‌స్తుతం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ళ ప్ర‌భంజ‌నం సృష్టిస్తుంది. మొన్న‌టి వ‌ర‌కు "రంగ‌స్థ‌లం" చిత్రంపై ఉన్న రికార్డులని తుడిపేస్తుంది. చ‌ర‌ణ్ న‌టించిన 'రంగ‌స్థ‌లం' చిత్రం తొలి రోజున త‌మిళ‌నాడులో రూ.25 ల‌క్ష‌ల గ్రాస్‌ని క‌లెక్ట్ చేయ‌గా, 'భ‌ర‌త్ అనే నేను' రూ.27 ల‌క్ష‌లకి పైగా గ్రాస్ వ‌సూలు చేసి స‌రికొత్త రికార్డు సృష్టించింది. నిజానికి మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన 'స్పైడ‌ర్' చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలైంది. ఈ చిత్రంతో మ‌హేష్‌కి త‌మిళ రాష్ట్రాల‌లోను ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.
 
ఈ క్ర‌మంలో అక్క‌డ మ‌రిన్ని వ‌సూళ్ళు రాబ‌ట్టొచ్చని స‌మాచారం. ఇక ఆస్ట్రేలియాలోనూ 'భ‌ర‌త్ అనే నేను' మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంటలు మండిస్తుంది. అక్క‌డ 35 ప్రాంతాల‌లో ఈ చిత్రం విడుద‌ల కాగా తొలి రోజు 168,194 డాల‌ర్లు (85.45ల‌క్ష‌ల) వ‌సూళ్ళు సాధించి మ‌హేష్ స్టామినా ఏంట‌నేది నిరూపించింది. రానున్న రోజుల‌లో ఈ చిత్రం మరిన్ని రికార్డులు కొల్ట‌గొట్ట‌డం ఖాయమని ఫిల్మ్ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments