Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మహానటి' మూవీ ప‌ట్ల ఇంట్ర‌స్ట్ చూపిస్తోన్న‌ బాలీవుడ్ హీరోయిన్ రేఖ!

సావిత్రి బయోపిక్‌గా రూపొందిన‌ 'మహానటి' సినిమా అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో స‌క్స‌స్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. సామాన్యుల నుంచి అసామాన్యుల వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రిని మ‌హాన‌టి ఆక‌ట్టుకుంది. ఫ‌స్ట్ డే ఈ సినిమాని సావిత్రి గారి అబ్బాయి స‌తీష్.. అమ్మాయి విజ

Webdunia
శనివారం, 12 మే 2018 (20:01 IST)
సావిత్రి బయోపిక్‌గా రూపొందిన‌ 'మహానటి' సినిమా అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో స‌క్స‌స్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. సామాన్యుల నుంచి అసామాన్యుల వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రిని మ‌హాన‌టి ఆక‌ట్టుకుంది. ఫ‌స్ట్ డే ఈ సినిమాని సావిత్రి గారి అబ్బాయి స‌తీష్.. అమ్మాయి విజ‌య చాముండేశ్వ‌రి విజ‌య‌వాడ‌లో చూసారు. తమ తల్లి జీవితాన్ని నిజాయితీగా తెరకెక్కించిన చిత్రమంటూ తమ మనసులోని మాటను చెప్పారు.
 
ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.... బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రేఖ మ‌హాన‌టి సినిమాను చూడాలనుకుంటున్నార‌ట‌. అదేంటి మ‌హాన‌టి సినిమాని రేఖ చూడాల‌నుకోవ‌డం ఏమిటి అనుకుంటున్నారా..? రేఖకి .. సావిత్రి పిన్ని అవుతుంది. జెమినీ గణేశన్ భార్య పుష్పవల్లికి రేఖ, రాధ అనే ఇద్దరు కుమార్తెలు వున్నారు. ఆ తరువాతనే ఆయన సావిత్రిని వివాహం చేసుకున్నాడు. 
 
తన తండ్రి జీవితంతో ముడిపడిన సినిమా కావడం వలన, తాను చూడాలనుకుంటున్నార‌ట‌. ఈ విష‌యాన్ని తన సోదరి రాధ ద్వారా ఆమె దర్శకనిర్మాతలకు కబురు పంపించార‌ని తెలిసింది. త్వరలోనే రేఖ కోసం మ‌హాన‌టి స్పెషల్ షో ఏర్పాటు చేస్తారేమో...!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments