Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోర్ మాటి పాటని ఆవిష్కరించిన చంద్రబోస్

Webdunia
మంగళవారం, 12 అక్టోబరు 2021 (17:01 IST)
chandrabose -goremati song
బంజారా బిగ్ సినిమాస్ పతాకంపై శంకర్ జాదవ్ ,కరిష్మా, అదిరే అభి, సిరి రాజ్ ప్రధాన తారాగణంగా శంకర్ జాదవ్ దర్శకత్వంలో రేఖ్య నాయక్ రెండు బాషలలో నిర్మిస్తున్న చిత్రం తెలుగులో రాజ్ పుత్ (బార్న్ ఆఫ్ వారియర్), బంజారాలో గోర్ మాటి (పవర్ ఆఫ్ యూనిటీ). ఈ చిత్రంలోని సాంగ్ ని చంద్రబోస్ ఆవిష్కరించారు.
 
ఆ సందర్భంగా చంద్రబోస్ మాట్లాడుతూ.. 'ఇండియాలో 12 కోట్లమంది బంజారాలు ఈ సినిమాను ఖచ్చితంగా చూడాల్సిన చిత్రం. ఖచ్చితంగా ఈ సినిమా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. నటీనటులు అద్భుతంగా నటించారు. దర్శకుడు కూడా ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఈ చిత్రాన్ని ఆదరిస్తే ఇలాంటివి మరెన్నో చిత్రాలు వారు మీముందుకు తీసుకువస్తారు. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ సాధించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
 
జబర్దస్ అదిరే అభి మాట్లాడుతూ.. 'మీరందరూ ఈ సినిమాను చూసి హిట్ చేస్తే... ఇంకొక పది సినిమాలు వస్తాయి. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్ లాగా బంజారా సినిమా కూడా ఉండాలి' అని అన్నారు.
 
హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన శంకర్ జాదవ్ మాట్లాడుతూ... 'ఈ బ్యానర్‌లో వస్తున్న గోర్ మాటి సినిమాతో ఆగిపోదు. బంజారాను స్థాయిని పెంచుతూ బంజారా జాతి గురించి తెలుపుతూ అందరి మెప్పు పొందేలా ఎన్నో సినిమాలు ఈ బ్యానర్ లో వస్తాయని అన్నారు. డైరెక్టర్, హీరోగా చేయడం అంటే అంత ఈజీ కాదు సినిమా టీమ్ అందరూ నాకు ఎంతో హెల్ప్ చేశారు అందరి సపోర్ట్ తో ఈ సినిమాను పూర్తి చేశాం. మీ ఆశీస్సులు కావాలి' అని అన్నారు.
 
నిర్మాత రేఖ్య నాయక్ మాట్లాడుతూ... 'ఈ సినిమాకోసం అందరూ నాకు చాలా హెల్ప్ చేశారు. వారందరికీ నా ధన్యవాదాలు. సినిమా కోసం డైరెక్షన్ డిపార్ట్మెంట్, డి.ఓ.పి గోపి, మ్యూజిక్ డైరెక్టర్ యమ్. యల్.రాజా,ఎడిటర్ క్రాంతి ఇలా చిత్ర యూనిట్ అందరూ కూడా ఏంతో డెడికేషన్‌ వర్క్ చేశారు. ఇందులో హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న శంకర్ ని తమ్ముడుగా భావిస్తాను. ఈ సినిమా చాలా బాగా వచ్చింది మా సినిమాను అందరూ చూసి గొప్ప విజయం సాధించేలా చేయాలని మనస్పూర్తిగా కోరుతున్నాను' అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments