Webdunia - Bharat's app for daily news and videos

Install App

'చంద్రముఖి' చిత్ర దర్శకుడు చనిపోయారా?

"చంద్రముఖి" చిత్రానికి దర్శకత్వం వహించిన తమిళ డైరెక్టర్ పి.వాసు చనిపోయినట్టు కోలీవుడ్‌లో వార్తలు గుప్పుమన్నాయి. దాంతో ఆయన వెంటనే సోషల్‌మీడియా వేదికగా తాను బతికే ఉన్నానని వీడియో ద్వారా చెప్పుకున్నారు.

Webdunia
మంగళవారం, 16 జనవరి 2018 (15:03 IST)
"చంద్రముఖి" చిత్రానికి దర్శకత్వం వహించిన తమిళ డైరెక్టర్ పి.వాసు చనిపోయినట్టు కోలీవుడ్‌లో వార్తలు గుప్పుమన్నాయి. దాంతో ఆయన వెంటనే సోషల్‌మీడియా వేదికగా తాను బతికే ఉన్నానని వీడియో ద్వారా చెప్పుకున్నారు. 
 
'ఆరు కిలోమీటర్లు వాకింగ్‌ చేసి ఇంటికి వెళ్లగానే నేను చనిపోయానని వదంతులు వస్తున్నట్టు వాట్సాప్‌లో నాకో సందేశం వచ్చింది. అది చూసి నవ్వుకున్నాను. ప్రజలకు నాపై ఇంత అభిమానం ఉందని తెలిసి సంతోషించాను కూడా. నేను బతికే ఉన్నాను. ఆరోగ్యంగానే ఉన్నాను. ఈ యేడాది మూడు సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నాను' అంటూ తన డెత్‌ దుష్ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. 
 
కాగా, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ సినిమాలకు వాసు దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాల్లో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘చంద్రముఖి’ చెప్పుకోదగ్గ గొప్ప చిత్రం. అలాగే, ఆయన పలు చిత్రాల్లో వివిధ రకాల క్యారెక్టర్లలో కూడా నటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశం-పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరుగుతుందా?

Jagan Padayatra 2.0 : 2027లో పాదయాత్ర 2.0 చేపడతారు.. గుడివాడ అమర్‌నాథ్

భారత్ దెబ్బకు ఎండిపోతున్న పాక్ నదులు... ఖరీఫ్ సీజన్ నుంచే నీటి కటకటా

భారత్ ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్‌ చేపట్టిందా?.. సిగ్గులేదా ఆ మాట చెప్పడానికి.. పాక్‌ను ఛీకొట్టిన దేశాలు...

కాశ్మీర్‌లో సాగుతున్న ఉగ్రవేట... ఆయుధాలతో ఇద్దరి అరెస్టు - యుద్ధ సన్నద్ధతపై కీలక భేటీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments