Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని ప్రేమించా.. బ్రేకప్ అయ్యింది.. ఇక పెళ్లిపై నమ్మకం లేదు: ఛార్మీ

ఛార్మింగ్ బ్యూటీ ఛార్మి పెళ్లిపై నమ్మకం లేదంటోంది. ఇందుకు కారణం ఆమె జీవితంలో జరిగిన బ్రేకపేనని చెప్పుకొచ్చింది. సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తిని ప్రేమించానని.. రెండు విషయాల వల్ల ఆ ప్రేమ విఫలమైందని

Webdunia
సోమవారం, 26 మార్చి 2018 (16:07 IST)
ఛార్మింగ్ బ్యూటీ ఛార్మి పెళ్లిపై నమ్మకం లేదంటోంది. ఇందుకు కారణం ఆమె జీవితంలో జరిగిన బ్రేకపేనని చెప్పుకొచ్చింది. సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తిని ప్రేమించానని.. రెండు విషయాల వల్ల ఆ ప్రేమ విఫలమైందని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఆ రెండు కారణాల వల్ల తమ ప్రేమకు గండిపడిందని.. ఒకవేళ ఆ రెండు కండిషన్లకు తలొగ్గి వివాహం చేసుకుని వుంటే.. విడాకులు తీసుకునే పరిస్థితి వచ్చేదని ఛార్మి తెలిపింది. 
 
తాను ప్రేమించిన వ్యక్తి మంచి వ్యక్తేనని.. కానే తానే చెడుదాన్ని అంటూ తెలిపింది. పెళ్లికి తర్వాత ప్రేమించిన వ్యక్తి కోసం సమయం కేటాయించలేనని.. ఇంటి పనులు చూసుకోలేకపోతానని భావించి ప్రేమకు కటీఫ్ ఇచ్చినట్లు ఛార్మీ తెలిపింది. ఇంకా చెప్పాలంటే, తమ సంబంధంలో ఎలాంటి స్పష్టత లేదు.. అందుకే విడిపోవాల్సి వచ్చిందని ఛార్మీ తెలిపింది. 
 
ఇక తనకు పెళ్లిపై నమ్మకం లేదని.. ఒక అబ్బాయిని చూసి ఇష్టపడే స్టేజ్‌లో తాను లేనని.. ఈ విషయాలన్నీ తన తల్లిదండ్రులు అర్థం చేసుకున్నారని, అందుకే వారితో ఉండేందుకే ఇష్టపడతానని ఛార్మీ చెప్పుకొచ్చింది. కాగా ప్రస్తుతం పూరీ జగన్నాథ్‌కు చెందిన  పూరీ కనెక్ట్స్ సంస్థకు సహ వ్యవస్థాపకురాలిగా బాధ్యతలు నిర్వహిస్తూ, ఛార్మీ బిజీ బిజీగా గడుపుతోంది. తద్వారా ఒకప్పుడు తన అందం, అభినయంతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన ఛార్మీ.. ప్రస్తుతం నిర్మాణ రంగంలో రాణిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

Duvvada Srinivas : నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు.. లంచాలు తీసుకోలేదు.. జగన్‌కు థ్యాంక్స్

పహల్గాంలో ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి కేక్ బాక్స్‌తో వెళ్లిన వ్యక్తి - Video Viral

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments