Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మనం సైతం'కు చిరంజీవి విరాళం... కాదంబరికి అభినందనలు

మెగాస్టార్ చిరంజీవి విరాళం చేశారు. మనం సైతం కార్యక్రమానికి ఆయన తన వంతు సాయంగా రూ.2 లక్షలు విరాళంగా ఇచ్చారు. అలాగే, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సినీ నటుడు కాదంబరి కిరణ్‌ను కూడా అభినందించారు.

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2017 (10:18 IST)
మెగాస్టార్ చిరంజీవి విరాళం చేశారు. మనం సైతం కార్యక్రమానికి ఆయన తన వంతు సాయంగా రూ.2 లక్షలు విరాళంగా ఇచ్చారు. అలాగే, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సినీ నటుడు కాదంబరి కిరణ్‌ను కూడా అభినందించారు. 
 
నిజానికి కాదంబరి కిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'మనం సైతం' పేరుతో ఎంతోమందికి సాయం చేస్తున్నారు. ముఖ్యంగా, జనాలకోసం, కష్టాల్లో ఉన్న పేదవాళ్ళకోసం, ఆపదలో ఉన్న సినిమావాళ్ళ కోసం, ఇంకా ఎవరైనాకానీ, విద్య, వైద్యం, ఆరోగ్యం, పెళ్లి, చావు కష్టం ఏదైనా.. తమవంతు సాయపడాలన్న తపనతో ఆయన మనం సైతంను అనే వేదికను ఏర్పాటు చేశారు. 
 
వాస్తవానికీ మనం సైతం అనేది ఓ వాట్సాప్ గ్రూపు. ఇది స్నేహితులు, సన్నిహితులు, తోటినటులతో ప్రారంభమైంది. ఇప్పుడు గాయనీగాయకులు, సామాజికవేత్తలు, శ్రేయోభిలాషులు, సేవాగుణంగల డాక్టర్లు, లాయర్లు, జర్నలిస్టులు.. ఇలా తమ సొంత హోదాలతో పనిలేకుండా.. ఎంతోమంది ముందుకు వచ్చి తనవంతు సాయం చేస్తున్నారు. ఇందుకోసం వారు ఆ గ్రూపుల్లో చేరారు కూడా. 
 
ఇలా సరికొత్త ఆలోచనతో ఎంతో మంది పేదలను ఆదుకుంటున్న కాదంబరిని చిరంజీవి ప్రత్యేకంగా అభినందించడమే కాకుండా, మనం సైతంకు తన వంతుగా 2 లక్షల రూపాయలను చిరంజీవి విరాళంగా ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments