Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.వంద కోట్ల క్లబ్‌లో చేరిన చిరంజీవి "వాల్తేరు వీరయ్య"

Webdunia
సోమవారం, 16 జనవరి 2023 (13:57 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. శృతిహాసన్ నటించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఈ నెల 13వ తేదీన సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన కేవలం మూడు రోజుల్లో ఏకంగా రూ.108 కోట్లను కొల్లగొట్టింది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. 
 
ఈ చిత్రంతో చిరంజీవితో రవితేజ తోడుకావడంతో పాటు రెండో భాగంలో ఎమోషన్ చేరింది. దీంతో ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఎంతగానో ఆకర్షించింది. పైగా, ఈ చిత్రం మొదలైన తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అదనపు బలం చేకూర్చింది. 
 
ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతిహాసన్ నటించగా, బాలీవుడ్ నటి ఊశ్వరి రౌతలా ఐటమ్ సాంగ్‌లో నటించారు. ప్రకాశ్ రాజ్ .. బాబీ సింహా ప్రతినాయకులుగా కనిపించారు. ప్రస్తుతం వసూళ్ల పరంగా అదే జోరును కొనసాగిస్తున్న ఈ సినిమా, లాంగ్ రన్ లో ఎంతవరకూ రాబడుతుందనేది చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments