Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైరా నరసింహారెడ్డి.. రాత్రి పోరాటం.. రూ.40 కోట్ల ఖర్చు.. ఎందుకు?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం హైదరాబాద్ శివార్లలో వేసిన భారీ సెట్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఉయ్యాలవాడ నరసి

Webdunia
గురువారం, 28 జూన్ 2018 (13:55 IST)
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం హైదరాబాద్ శివార్లలో వేసిన భారీ సెట్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే స్వాతంత్ర్య సమరయోధుడి కథ ఇది. 200 కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ సినిమాను చరణ్ నిర్మిస్తున్నాడు.
 
తాజా షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్లో జరుగుతోంది. నరసింహారెడ్డికి .. ఆంగ్లేయులకు మధ్య రాత్రివేళలో జరిగే పోరాట సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరిస్తున్నారు. నరసింహారెడ్డిని వీరోచిత నాయకుడిగా ఆవిష్కరించే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షూటింగ్‌లో హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రఫర్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో హాలీవుడ్ ఫైటర్స్ పాల్గొంటున్నారు. 
 
ఈ కారణంగా ఈ ఒక్క షెడ్యూల్ కోసమే రూ. 40కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారట. యుద్ధ సన్నివేశాలను తెల్లవారు జాము 3 గంటలవరకు కూడా కొనసాగిస్తున్నారట. అయినప్పటికీ చిరు చాలా ఎనర్జిటిక్‌గా షూటింగ్‌లో పాల్గొంటున్నారట. ఇక నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను వచ్చే వేసవిలో విడుదల చేయనున్నారు. 
 
మరోవైపు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌బచ్చన్, జగపతిబాబు, సుధీప్ లాంటి ప్రముఖ నటీనటులు నటిస్తున్న ఈ సినిమా హక్కుల కోసం భారీ పోటీ నెలకొందట. ఇప్పటికే రెండు మూడు సంస్థలు ఈ హక్కుల కోసం పోటీపడుతున్నట్టు తెలిసింది. ముఖ్యంగా ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వి క్రియేషన్స్ భారీ రేటుకు ఈ సినిమా థియేట్రికల్ హక్కులను తీసుకునేందుకు సిద్ధమైందని టాక్ వస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశం దాడులతో పాకిస్తాన్ కకావికలం: బంకర్‌లో దాక్కున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి

INS Vikrant గర్జన: పాకిస్తాన్ లోని కరాచీ పోర్టు నేలమట్టం (video)

జమ్మూపై పాకిస్తాన్ క్షిపణి, డ్రోన్ దాడులు: పాక్ 2 JF17 ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత సైన్యం

Anantapur MP: అనంతపురం ఎంపీ సోదరి హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి

Telangana: ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తున్నాం.. భట్టి విక్రమార్క

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments