Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను ఎవరి కాలుమీద కాలేసి కూర్చోను: వేణు మాధవ్

సినిమాలకు దూరమై.. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక రాజకీయాల్లోకి దిగిన హాస్య నటుడు వేణుమాధవ్.. తన సినిమా షూటింగ్ అనుభవాలను తాజా ఇంటర్వ్యూలో తెలిపాడు. తానొక సినిమా షూటింగుకి వెళ్లినప్పుడు ఓ పెద్ద హీరో తన

Webdunia
శుక్రవారం, 24 నవంబరు 2017 (11:06 IST)
సినిమాలకు దూరమై.. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక రాజకీయాల్లోకి దిగిన హాస్య నటుడు వేణుమాధవ్.. తన సినిమా షూటింగ్ అనుభవాలను తాజా ఇంటర్వ్యూలో తెలిపాడు. తానొక సినిమా షూటింగుకి వెళ్లినప్పుడు ఓ పెద్ద హీరో తనను పిలిచారని.. ఏవయ్యా నువ్వు కాలు మీద కాలేస్తావట కదా అడిగారు. నేను ఎవరు చెప్పారని అడిగాను. నేను నిరూపిస్తానయ్యా అంటూ ఎవరికో ఫోన్ చేస్తున్నారు. 
 
ఇంతలో ఆయన్ని అడ్డుకుని విషయమేంటో స్పష్టంగా చెప్పండి సార్ అన్నాను. నువ్వు కాలుమీద కాలేసుకుని కూర్చుకుంటావట గదా.. అన్నారు. వెంటనే "నేను ఎవరి కాలుమీద కాలేసి కూర్చోను సార్ .. నా కాలుమీద నా కాలేసుకుని కూర్చుంటాను. 
 
అదెలా తప్పవుతుందని ఆయన్నే ప్రశ్నించాను. అలా అడగ్గానే రెండు నిమిషాల పాటు ఆయన సైలెంట్‌గా వుండిపోయారని వేణు మాధవ్ చెప్పుకొచ్చారు. నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదని చెప్తూనే.. సరే ఇక నీ ఇష్టం అలాగే కానీ అన్నారు. ఏం చేస్తాం అది తన అలవాటని వేణుమాధవ్ చెప్పుకొచ్చారు.

నేను వున్న చోటు నుంచి షూటింగుకి వెళ్లడానికి కొంత ఆలస్యం అవుతుంది. ఆ విషయాన్ని ముందుగానే చెప్తా ను. అంతేగానీ ఉద్దేశ పూర్వకంగా ఆలస్యంగా వెళ్లను. ఇక నేను పెద్ద హీరోలను కూడా వెయిట్ చేస్తాననే మాటలో నిజం లేదు. ఒక చోట షూటింగ్ పూర్తి కాగానే మరో షూటింగ్‌కి వెళ్లేవాడిని. మధ్యలో ప్రయాణానికి కొంత సమయం పడుతుంది కదా.. అని ప్రశ్నించారు. పెద్ద హీరోలతో చాలా చనువుగా వుంటానని వేణు మాధవ్ చెప్పాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments