Webdunia - Bharat's app for daily news and videos

Install App

సల్మాన్ సినిమా ఫ్లాప్ కావడంతో చనిపొమ్మంటూ ట్రోల్స్ చేశారు : డైసీ షా

Webdunia
గురువారం, 5 అక్టోబరు 2023 (12:50 IST)
బాలీవుడ్ హీరోయిన్ డైసీ షా సంచలన విషయాలను బహిర్గతం చేశారు. గత 2014లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో చేసిన 'జయహో' చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదారణ పొందలేక పోయింది. ఈ చిత్ర ఫ్లాప్‌కు హీరోయిన్ డైసీ షానే కారణమంటూ ప్రేక్షకులు విమర్శలు మొదలుపెట్టారు. నెటిజన్స్‌ ఇష్టానుసారంగా ట్రోల్స్ చేశారు. వీటిపై డైసీ షా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనస్సులోని మాటను బహిర్గతం చేశారు. 
 
'ఏక్ థా టైగర్' సినిమా తర్వాత సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం 'జయహో'. ఈ చిత్రం ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. అయితే, ఆ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. దీనికి తానే కారణమంటూ విమర్శలు చేశారు. అన్ని రకాలుగా ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. మరికొందరు మితిమీరిన కామెంట్స్ చేశారు. నువ్వు ఇంకా ఎందుకు బతికోవున్నావు.. చచ్చిపోవచ్చు కదా దీనికి మించి ఇంకేం చేయాలనుకుంటున్నావు అని తీవ్రంగా దూషించారు. 
 
తన వరకు 'జయహో' చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. రూ.60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించగా, రూ.138 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇంతకంటే ఇంకేం కావాలి. ఇవన్నీ తెలియని అమాయక ప్రేక్షకులు తనను ఆడిపోసుకున్నారు' అంటూ చెప్పుకొచ్చారు. కాగా, ఈ బాలీవుడ్ నటి కన్నడ, తమిళ చిత్రాల్లో కూడా అతిథి పాత్రల్లో నటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ ఎప్ సెట్ ఫలితాలు రిలీజ్ - తొలి మూడు స్థానాలు ఆంధ్రా విద్యార్థులవే...

వీర జవాను మురళీ నాయక్ శవపేటికను మోసిన మంత్రి నారా లోకేశ్ - తండా పేరు మార్పు!!

ప్రపంచ పటంలో పాకిస్థాన్ పేరును లేకుండా చేయాలి.. : వీర జవాను కుమార్తె (Video)

బ్రహ్మోస్ క్షిపణుల శక్తి తెలియని వారు పాక్‌ను అడిగి తెలుసుకోండి : యోగి ఆదిత్యనాథ్ (Video)

శాంతి చర్చలకు వెళ్లిన ప్రధాని మోడీని పాకిస్థాన్‌కు పంపాలా? సీపీఐ నేత నారాయణ ప్రశ్న (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments