Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్‌లో విషాదం.. 'ధూమ్' ఫేమ్ సంజయ్ గాధ్వి కన్నుమూత

Webdunia
ఆదివారం, 19 నవంబరు 2023 (16:40 IST)
బాలీవుడ్ చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. స్టార్ దర్శకుడు "ధూమ్" ఫేమ్ సంజయ్ గాధ్వి మృతి చెందారు. గుండెపోటు కారణంగా ఆయన మృతి చెందినట్టు గాధ్వి కుమార్తె వెల్లడించారు. మరో మూడు రోజుల్లో గాద్వి తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకోవాల్సివుంది. ఇంతలోనే ఆయన తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. 
 
ఆదవారం ఉదయం 9.30 గంటలకు గాధ్వి కన్నుమూశారని కుమార్తె సంజీనా వెల్లడించారు. అయితే, ఆయనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవనీ, బహుశా గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచివుంటారని అభిప్రాయపడ్డారు. 
 
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ 'ధూమ్', 'ధూమ్-2' వంటి చిత్రాలకు గాధ్వి దర్శకత్వం వహించారు. గాధ్వి వయసు 56 సంవత్సరాలు. ఆయన 2000లో "తేరే లియే' చిత్రంతో సినీ కెరీర్‌ను ప్రారంభించారు. 2002లో "మేరే యార్ కి షాదీ హై' చిత్రంలో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. కేరీర్‌లో చివరగా 'ఆపరేషన్ పరిందే' చిత్రానికి దర్శక్తవం వహించగా, ఇది గత 2020లో విడుదలైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

Golden Hour: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్య చికిత్స - గోల్డెన్ అవర్ సమయంలో?

ఓబుళాపురం మైనింగ్ కేసు తుది తీర్పు : సబితా ఇంద్రారెడ్డి పరిస్థితి ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments