Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనీ లాండరింగ్ కేసు.. మోహన్ లాల్‌కు నోటీసులు

Webdunia
శనివారం, 14 మే 2022 (19:48 IST)
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మనీ లాండరింగ్ వ్యవహారంతో చిక్కుల్లో పడ్డారు. మనీ లాండరింగ్ వ్యవహారం కింద ఆయనకు ఈడీ నోటీసులు జారీ చేసినట్టు సమాచారం అందుతోంది. వ‌చ్చే వారం విచార‌ణ‌కు రావాలంటూ ఈడీ అధికారులు ఆయ‌న‌కు నోటీసులు జారీ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. విచార‌ణ కోసం కొచ్చిలోని ఈడీ కార్యాల‌యానికి రావాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నట్టు సమాచారం. 
 
కేర‌ళ‌కు చెందిన వ్యాపారి మాన్స‌న్ మాన్క‌ల్‌తో క‌లిసి మోహ‌న్ లాల్ మ‌నీ ల్యాండ‌రింగ్‌కు పాల్ప‌డిన‌ట్టు ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో మాన్స‌న్‌ను గ‌తేడాది సెప్టెంబ‌ర్‌లోనే కేర‌ళ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసుపై దృష్టి సారించిన ఈడీ.. మాన్స‌న్‌తో క‌లిసి మోహ‌న్ లాల్ కూడా మ‌నీ ల్యాండ‌రింగ్‌కు పాల్ప‌డిన‌ట్టు భావిస్తోంది.
 
ఈ విష‌యం నిర్ధార‌ణ కోస‌మే ఆయ‌న‌కు నోటీసులు జారీ చేసిన‌ట్లు తెలుస్తోంది. మొత్తానికి మోహన్ లాల్‌‌కు ఈడీ నోటీసులు పంపించందనే వార్త మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మోహన్ లాల్ ప్రస్తుతం బిగ్ బాస్ షోతో పాటు, తన సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత నేవీ త్రిశూల శక్తి - సముద్రంపై - నీటి కింద - అలల మీద...

ఉగ్రవాదులు - అండగా నిలిచేవారు మూల్యం చెల్లించుకోక తప్పదు : ప్రధాని మోడీ వార్నింగ్

Kanpur: యువజంట నూడుల్స్ తింటుంటే దాడి చేశారు.. వీడియో వైరల్

నీకెన్నిసార్లు చెప్పాలి... నన్ను కలవడానికి ఢిల్లీకి రావాలని? లోకేశ్‌కు ప్రధాని ప్రశ్న!

Hyderabad: నెలవారీ బస్ పాస్ హోల్డర్ల కోసం మెట్రో కాంబో టికెన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments