ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

ఠాగూర్
బుధవారం, 26 మార్చి 2025 (12:22 IST)
మెగాస్టార్ చిరంజీవి, సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కబోతుంది. ఈ చిత్రం పూజా కార్యక్రమం ఉగాది రోజున జరుగనుంది. సినిమా షూటింగును జాన్ నుంచి ప్రారంభించాలన్న మేకర్స్ భావిస్తున్నారు. ఈ వార్త మెగా ఫ్యాన్స్‌లో జోష్ నింపుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 
 
కాగా, చిరు - అనిల్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం పూర్తి హాస్య భరితంగా తెరకెక్కనుంది. ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జూన్ నుంచి ప్రారంభంకానుంది. 2026 సంక్రాంతికి సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తుండగా, భీమ్స్ సిసిరోలియా సంగీతం అందిస్తున్నారు. హీరోయిన్లు, ఇతర నటీనటుల ఎంపిక జరగాల్సివుంది. 
 
కాగా, గత సంక్రాంతికి వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన "సంక్రాంతికి వస్తున్నాం" ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించిన విషయం తెల్సిందే. ఈ చిత్రం ఏకంగా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సంక్రాంతి మెగా బ్లాస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Devaragattu: మల్లేశ్వర స్వామిలో కర్రలతో ఘర్షణ.. ఇద్దరు వ్యక్తులు మృతి

ఛత్తీస్‌గఢ్‌‌లో లొంగిపోయిన 103 మంది నక్సలైట్లు - 22 మంది మహిళలతో..?

Heavy Rains: ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు- రెడ్ అలర్ట్ జారీ

గోపాల్ పూర్ వద్ద తీరం దాటిన వాయుగుండం... ఉత్తర కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన

బ్రహ్మోస్ క్షిపణిని మించిన మిస్సైల్ - ధ్వని పేరుతో హైపర్ సోనిక్ గ్లైడ్ వెహిచక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

తర్వాతి కథనం
Show comments