Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగార్జున ''హల్లో పిల్లా''.. భర్తను వదిలేసింది.. బాయ్‌ఫ్రెండ్‌తో ఐదేళ్ల పాటు..?

టాలీవుడ్ దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఆయన తనయుడు హీరోగా వచ్చిన గ్రీకువీరుడు సినిమాలో పూజాబాత్రా నటించింది. ఆ తర్వాత సిసింద్రీ సినిమాల్లో నాగార్జునకు జోడీగా అతిథి పాత్రలో కనిపించింది. నాగార్జ

Webdunia
గురువారం, 25 మే 2017 (15:50 IST)
టాలీవుడ్ దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఆయన తనయుడు హీరోగా వచ్చిన గ్రీకువీరుడు సినిమాలో పూజాబాత్రా నటించింది. 

''గ్రీకు వీరుడు'' అంటే నాగార్జున నటించిన సినిమా కాదు.. ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు తనయుడు దాసరి అరుణ్ హీరోగా దాసరి దర్శకత్వంలో వచ్చిన ''గ్రీకు వీరుడు'' సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామకు ఆ సినిమా నిరాశనే మిగిల్చింది.  ఆ తర్వాత సిసింద్రీ సినిమాల్లో నాగార్జునకు జోడీగా అతిథి పాత్రలో కనిపించింది. నాగార్జునతో కలిసి నటించిన హల్లో పిల్లా అనే సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ మధ్య కొరియాగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా ''ఏబిసిడి 2" సినిమాలో చేసి హాట్ హాట్‌గా అలరించింది. ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయిన ఈ నలభై ఏళ్ల సుందరి మళ్ళి సినిమాల్లో బిజీ అయ్యేందుకు ప్లాన్ చేస్తోంది.

అయితే ప్రస్తుతం భర్తనుంచి విడిపోయిన ఆమె ఐదేళ్ల పాటు క్రిస్టియన్ అనే బాయ్ ఫ్రెండ్‌తో సహజీవనం చేస్తోంది. అంతకంటే తన వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువ అడగొద్దంటోంది. తన భర్తతో స్నేహపూర్వకమైన సంబంధాలున్నాయని పూజాబ్రాతా వెల్లడించింది. 
 
ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌, ముంబై మధ్య తన సినీ ప్రయాణం జరుగుతుందని చెప్పింది. సెక్స్ బానిసల మీద డాక్యుమెంటరీలో పూజాబాత్రా నటించింది. ఇది భారత్‌లోని ఓ అమ్మాయి దీనగాథ. వేశ్య వృత్తి నుంచి ఎలా బయటపడ్డారనే కోణంలో ఈ డాక్యుమెంటరీని చిత్రీకరించినట్లు చెప్పింది.

మరో హాలీవుడ్ చిత్రం 'వన్ అండర్ ది సన్' అనే చిత్రంలో నటించాను. గతేడాది కేన్స్ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించారు. గతేడాది ఇండియాకు వచ్చి ఏబీసీడీ2 చిత్రంలో నటించాను. మరో పంజాబీ చిత్రంలో కూడా మంచి పాత్ర పోషించానంటూ బాత్రా చెప్పుకొచ్చింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

My Sindoor to Border: పెళ్లైన మూడు రోజులే. నా సింధూరాన్ని సరిహద్దులకు పంపుతున్నా..

Asaduddin Owaisi: పాకిస్తాన్ మజాక్ చేస్తుంది.. భారత్ కోసం ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధం.. ఓవైసీ (video)

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం