Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమాలో సంగతి సరే... నిజంగా హీరోయిన్‌కి ఎన్ని పుట్టుమచ్చలున్నాయో చూసావా? విలేకరి వెకిలి ప్రశ్న

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (11:42 IST)
విలేకరులు ఎలాంటి ప్రశ్నలు వేయాలి? మీడియా సమావేశంలో ఎలా ప్రవర్తించాలన్నది చాలామందికి తెలియకుండా పోతుంది. కొందరైతే హీరోహీరోయిన్లకు వెకిలి ప్రశ్నలు వేస్తూ వారి స్థాయిని దిగజార్చుకుంటున్నారు.

 
ఇక అసలు విషయానికి వస్తే... డీజే టిల్లు చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న నేహాశెట్టి పట్ల ప్రముఖ విలేకరి వెకిలి ప్రశ్న వేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బుధవారం నాడు హైదరాబాదులో చిత్ర యూనిట్ ట్రెయిలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్ర హీరోయిన్ నేహాశెట్టి గురించి ఇబ్బందికరమైన ప్రశ్నను సంధించాడు ఓ విలేకరి.

 
డీజే టిల్లు ట్రైలర్లో హీరోయిన్‌కి హీరో ఓ ప్రశ్న వేస్తాడు. నీకు ఎన్ని పుట్టుమచ్చలున్నాయని అడిగితే... పదహారు అంటూ జవాబిస్తుంది. ఈ డైలాగును ఆసరా చేసుకున్న ఓ జర్నలిస్ట్... హీరోయిన్‌కి నిజంగా ఎన్ని పుట్టుమచ్చలున్నాయో తెలుసుకున్నారా..? అంటూ హీరోని ప్రశ్నిస్తూ వెకిలి నవ్వు నవ్వాడు.

 
దీనిపై హీరో ఇబ్బందిపడుతూ... దీన్ని అవాయిడ్ చేద్దామంటూ సమాధానం చెప్పారు. ఐతే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. హీరోయిన్ నేహాశెట్టి సదరు జర్నలిస్టుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్విట్టర్లో స్పందించింది. చిత్ర నిర్మాత సారీ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ జిందాబాద్ అనే వారి కాళ్లు నిర్ధాక్షిణ్యంగా విరగ్గొట్టాలి : సీఎం హిమంత

నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఆ 13 ఏళ్ల విద్యార్థి: 23 ఏళ్ల లేడీ టీచర్ షాకింగ్ న్యూస్

Pawan Kalyan: రైతన్నలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.. పవన్ కల్యాణ్ (video)

Aghori లేడీ కాదు, అవాక్కయ్యారా? చంచల్ గూడ జైలుకి అఘోరి శ్రీనివాస్

పవన్ జీ... వికసిత్ భారత్‌కు ఏపీ గ్రోత్ ఇంజిన్ కావాలి.. ఇది మనం చేయాలి... : ప్రధాని మోడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments